Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన పని గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు
వారంతా ఐఎఎస్ అధికారులే. ఇద్దరు సబ్ కలెక్టర్లు. ఒకరు ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్. వారే ఐఎఎస్ అధికారి రాజమాణిక్యం, వాయ నాడ్ సబ్ కలెక్టర్ ఎన్ ఎస్ కె ఉమేశ్, పద్మ నాభపురం సబ్ కలెక్టర్ రాజగోపాల్.
కేరళను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల వల్ల వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి. దేశవ్యాప్తంగా అక్కడి బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వారు కోలుకోవాలని వరదలు తగ్గాలని అందరూ కోరుకుంటున్నారు. అందరూ వారికి తోచినంత సాయం కేరళవాసుల కోసం చేస్తున్నారు.

సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ
పోలీసులు, ఆర్మీకు చెందిన వారు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను వారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఇప్పుడు కేరళ వరదలే హాట్ టాఫిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో అక్కడి అధికారుల తీసుకుంటున్న చొరవ చూసి అందరూ అభినందిస్తున్నారు.
పునరావాస కేంద్రాలు
కేరళలోని బాధితులను ఆదుకునేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు అక్కడ అన్నీ కనీసం సౌకర్యాలు ఉండేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక పునరావాస కేంద్రానికి ఒక లారీలో బియ్యం వచ్చాయి. ఆ లారీ వచ్చినప్పుడు అక్కడే ముగ్గురు అధికారులున్నారు.
వారంతా ఐఎఎస్ అధికారులే
వారంతా ఐఎఎస్ అధికారులే. ఇద్దరు సబ్ కలెక్టర్లు. ఒకరు ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్. వారే ఐఎఎస్ అధికారి రాజమాణిక్యం, వాయ నాడ్ సబ్ కలెక్టర్ ఎన్ ఎస్ కె ఉమేశ్, పద్మ నాభపురం సబ్ కలెక్టర్ రాజగోపాల్.
జనాల నుంచి ఎప్పుడూఅభినందనలు వెల్లువెత్తుతుంటాయి
వారు లారీలోని బియ్యం సంచులను పునరావస కేంద్రంలోకి తీసుకెళ్లడానికి సహకరించారు. స్వయంగా వారే బియ్యపు సంచులను భుజాన వేసుకుని కేంద్రంలో వేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు హోదాలు మరిచి సామాన్యుల్లా జనానికి సాయం చేసే అధికారులు చాలా కొందరే ఉంటారు. అలాంటి అధికారులకు జనాల నుంచి ఎప్పుడూఅభినందనలు వెల్లువెత్తుతుంటాయి.



Click it and Unblock the Notifications











