Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
వారి పిల్లలకు పెళ్లి ఫిక్స్ చేశారు.. వరసలు మారతాయనే భయంతో.. లేటు వయసులోనే లేచిపోయారు...!
వారు గాఢమైన ప్రేమలో ఉన్న సమయంలో అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట. అయితే తమ పిల్లల పెళ్లి వల్ల తాము మళ్లీ ఒక్కటవుతున్నామని భావించారట.
మరి కొద్ది రోజుల్లో తమ పిల్లల జరగబోతోంది. పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. అయితే ఈ పెళ్లి జరగడానికి ముందే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ట్విస్ట్ అంటే ఈరోజుల్లో పెళ్లికి ముందే పెళ్లికుమారుడు పారిపోవడం లేదా పెళ్లి కూతురు మరొకరితో వెళ్లిపోవడం వంటి సంఘటనలను ఎన్నో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే సంఘటన గురించి మీరు ఇప్పటిదాకా అస్సలు విని ఉండరు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లల పెళ్లిని ఘనంగా చేయాలనుకుంటారు.

అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే వారి తల్లిదండ్రులే తమ పిల్లల పెళ్లికి విలన్లు అయ్యారు. ఇదంతా మామూలే అనుకుంటే పొరపాటే.. వారు ఆ పెళ్లిని ఆపాలనుకున్నా అది సాధ్యపడకపోవడంతో ఏకంగా వారే పెళ్లికి సిద్ధమయ్యారు.

వరుడి తండ్రి.. వధువు తల్లి కలిసి జంప్ జిలానీ అయ్యారు. ఇదంతా గుజరాత్ రాష్ట్రంలో ఇటీవలే చోటు చేసుకుంది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ లేటు వయసులో వారు ఎందుకు లేచిపోయారు? తమ పిల్లల జరిగిందా లేదా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకోండి...

పిల్లల పెళ్లికి ముందే...
గుజరాత్ లోని సూరత్ లో తమ పిల్లల పెళ్లికి ముందే పెళ్లి కుమారుడి తండ్రి, పెళ్లికూతురు తల్లి ఇద్దరు చిన్ననాటి నుండే ప్రేమలో ఉన్నారట.

కొన్ని కారణాల వల్ల..
వారు గాఢమైన ప్రేమలో ఉన్న సమయంలో అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట. అయితే తమ పిల్లల పెళ్లి వల్ల తాము మళ్లీ ఒక్కటవుతున్నామని భావించారట.

ప్రేమ పావురాల్లా..
అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. ఎవ్వరు ఏమనుకున్నా.. ఈ సమాజంతో మనకు పని లేదు అనుకొని తమ ప్రేమ ప్రపంచంలోని విహరించడానికి ప్రేమ పావురాల్లాగా ఎగిరిపోయారంట.

ఇద్దరికీ 40+
అయితే పెళ్లకొడుకు తండ్రి వయసు 48 ఏళ్లు కాగా.. పెళ్లి కూతురు తల్లి వయసు 40 ఏళ్లు. వీరిద్దరూ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించడానికి పది రోజుల ముందు మళ్లీ ప్రేమాయణం మొదలెట్టారట. అయితే ఇప్పటికీ వీరిద్దరి జాడ తెలియకపోవడం గమనార్హం.

పెటాకులైన పిల్లల పెళ్లి...
మరి కొద్ది రోజుల్లో ఒక్కటవ్వాల్సిన జంటకు పెద్ద ఆటంకమే వచ్చి పడింద. వారిద్దరూ ఎవ్వరు చేయకూడని పని చేయడంతో పిల్లల పెళ్లి పెటాకులైపోయింది.

ఎవ్వరికీ చెప్పకుండా...
వీరి కుటుంబాలకు ఇంతకుముందే మంచి పరిచయం ఉండటంతో సంవత్సరం క్రితమే వారి పిల్లలకు పెళ్లిళ్లను నిర్ణయించారు. పిల్లలు పెళ్లి చేసుకుంటే తమ వరసలు ఎక్కడ మారతాయనే భయంతో వారిద్దరూ ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయారు.

ఆలస్యంగా తెలిసింది..
వారిద్దరూ కలిసి లేచిపోయారన్న సంఘటన ఈ రెండు కుటుంబాల వారికి చాలా ఆలస్యంగానే తెలిసింది. ఎందుకంటే పెళ్లి పనులు మొదలెట్టిన నాటి నుండే వారిద్దరూ కనబడకుండా పోయారు.

సోషల్ మీడియాలో వైరల్..
ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాలు ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాయట. ఇక పెళ్లికొడుకు, పెళ్లికూతురు పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. ఇదే విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతుండటం విశేషం.



Click it and Unblock the Notifications