Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
కరోనా వేళ ఈ పరిహారాలు చేస్తే కచ్చితంగా ప్రయోజనాలుంటాయట...!
వక్కలతో ఈ ప్రత్యేక పరిహారాలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రపంచంలో మరియు మన దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అంతా తలకిందులైపోయింది. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కనీసం పూట గడవటం అనేది కూడా కష్టంగా మారిపోయింది.

మరోవైపు ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ సడలింపులు దశల వారీగా వదులుతూ ఉండటంతో, ఇప్పుడిప్పుడే అన్ లాక్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వక్కలతో కొన్ని నివారణలు చేస్తే మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగవుతుంది. అంతేకాదు మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, వివాహం, వ్యాపారంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఆ వక్కలను ఆకులతో కలిపి వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే.. ఆర్థిక పరంగా మీకున్న సమస్యలన్నీ కచ్చితంగా పరిష్కారమవుతాయి...

అయితే వాటిని ఎలా సమర్పించాలి... వాటితో పాటు ఏయే వస్తువులను ఉపయోగించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గణేశుని చిహ్నం..
మీరు వినాయకుడిని ఆరాధించేటప్పుడు పగలని వక్కలను ఉపయోగించి, పూజలో పాల్గొనాలి. ఇది గణేశుడికి చిహ్నంగా మారుతుంది. పూజ తర్వాత, మీరు మీ సంపద స్థానంలో వక్కలను ఉంచండి. ఈ పరిహారంతో లక్ష్మీదేవి మీపై దయ చూపుతుంది. మీరు మీ చేతికి దాన్ని కట్టుకుంటే కూడా మంచిది.

వ్యాపారంలో విజయం కోసం..
వ్యాపారులు తిరిగి విజయం సాధించేందుకు శనివారం రాత్రి పీపాల్ చెట్టును పూజించాలి. ఒక రూపాయి నాణెన్ని వక్క గింజతో ఉంచండి. దాన్ని తర్వాతి రోజు ఆ వక్కగింజను పగులగొట్టి పీపాల్ చెట్టు నుండి ఒక ఆకును తీసి, అందులో దాన్ని వేయండి. తర్వాత నాణెం కూడా జత చేసి ఎర్రటి దారాన్ని కట్టండి. అనంతరం దాన్ని తీసుకుని మీ ఖజానాలో ఉంచండి. అప్పటి నుండి మీ వ్యాపారం కచ్చితంగా పెరుగుతుంది.

మీ ప్రయత్నాలు విఫలమవ్వకుండా..
మీరు ఏవైనా పనులు లేదా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, అవి పదే పదే విఫలమవుతుంటే, వక్క గింజలతో ఈ పనులు చేయండి. కచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు లవంగాలు మరియు వక్కలను మీ పర్సులో ఉంచుకోండి. ఆ సమయంలో లవంగాలను నోటిలో ఉంచుకోండి. తర్వాత వక్క గింజను గణుశుడి ముందు పెట్టండి. ఇలా చేస్తే మీ పనులన్నీ కచ్చితంగా పూర్తవుతాయి.

వివాహాలలో అడ్డంకులు..
మీ పిల్లల వివాహంలో ఏమైనా ఆలస్యం జరిగితే లేదా మీరు మంచి భాగస్వామిని కనుక్కోలేకపోతే, మీరు ఈ ప్రత్యేకమైన వక్కలతో ఇలా చేయండి. పవిత్రమైన పౌర్ణమి రోజున మీరు పూజ చేసే ప్రదేశంలో ఈ ప్రత్యేకమైన వక్కలను ఉంచండి. దీని వల్ల మీరు కచ్చితంగా మంచి సంబంధాన్ని పొందుతారు లేదా మీ వివాహం త్వరలోనే జరుగుతుంది.

పనులు సులభమయ్యేందుకు..
మీ పనులు సులభతరం కావడానికి మొదట వక్కపోడి ఆకు తీసుకోండి. దానిపై సింధూరం మరియు నెయ్యితో స్వస్తిక చిహ్నాన్ని తయారు చేయండి. దాని మీద వక్కను ఉంచి, దాన్ని చుట్టండి. ఆ తర్వాత పూజ చేయండి. అలా చేయడం ద్వారా మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు ఉంటే, అవి తొలగిపోయి మీకు స్వేచ్ఛ లభిస్తుంది.



Click it and Unblock the Notifications