Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
Upasana Egg Freezing: తన ఎగ్స్ ఫ్రీజ్ చేసిన ఉపాసన.. పెళ్లైన కొత్తలోనే నిర్ణయం..
మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త అయిన ఉపాసన తన ప్రెగ్నెంట్ అని ఈ మధ్యే వెల్లడించిన విషయం తెలిసిందే. 2012 సంవత్సరంలో మెగా ఇంటికి కోడలిగా వెళ్లింది ఉపాసన కామినేని. దశాబ్దం తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు ఈ టాలీవుడ్ లవబుల్ కపుల్. తాజాగా తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ఉపాసన.

'పిల్లలు ఎప్పుడు కావాలో నిర్ణయించుకున్నాం'
పెళ్లికి ముందే ఉపాసన, రామ్ చరణ్ మంచి స్నేహితులు. పెళ్లిన తర్వాత పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనే విషయంలో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉపాసన తెలిపింది. పెళ్లైన కొత్తలోనే తన ఎగ్స్ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకుని ఎగ్స్ ను భద్రపరిచినట్లు చెప్పింది. ఎగ్స్ ఫ్రీజ్ చేయాలన్న నిర్ణయం వెనక అసలు కారణాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించింది.
'స్థిరపడ్డాకే పిల్లలు కావాలనుకున్నాం'
2012 లో వివాహం అయ్యాక కొత్తలోనే పిల్లల విషయంలో ఇద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది ఉపాసన. అందుకోసం ఎగ్స్ ఫ్రీజ్ చేయాలనుకున్నట్లు వెల్లడించింది. ఎందుకంటే ఆ సమయంలో ఇద్దరం తమ తమ కెరీర్ లపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావించినట్లు తెలిపింది. జీవితంలో స్థిర పడాలని, మంచి సంపాదన తర్వాతే పిల్లలు కనాలని ఇద్దరం నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
ప్రస్తుతం ఇద్దరం ఎవరి ఫీల్డ్ లో వారు మంచి స్థానంలో ఉన్నామని, మంచి సంపాదన కూడా ఉండటంతో పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలమనే నమ్మకం వచ్చిందని చెప్పుకొచ్చింది ఉపాసన. అలా పెళ్లైన దశాబ్దం తర్వాత గర్భం దాల్చినట్లు వివరించింది.
'నేను బిడ్డను మోస్తున్నాను.. తను బాధ్యతలు మోస్తున్నాడు'
తల్లిగా నేను బిడ్డను మోస్తున్నాను.. రామ్ చరణ్ అదే స్థాయిలో బాధ్యతలు మోస్తున్నాడని ఉపాసన తెలిపింది. చెర్రీ బిడ్డను మోయకపోయినప్పటికీ.. గర్భస్థ శిశువును ఎప్పుడూ కాపాడుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. తాను బిడ్డను మోస్తుంటే.. తన బాధ్యతలను చెర్రీ తీసుకుంటున్నాడని, డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం, డైట్ పర్యవేక్షించడం, వ్యాయామం చేయడం, మానసికంగా ఉల్లాసంగా ఉంచడం లాంటివి చేస్తుంటాడని చెప్పుకొచ్చింది. ఓ బిడ్డకు జన్మనివ్వడంలో తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తండ్రికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలంది.
'ఈ ఏడాది జులైలో ప్రసవం'
తనకు 2023 జులైలో ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పినట్లు ఉపాసన తెలిపింది. ఈ జులైలో తమ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి రాబోతున్నాడని చెప్పింది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లాగే తామిద్దరం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు పేర్కొంది. తన సంస్థ తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుందని చెప్పిన ఉపాసన.. ప్రసవం కోసం ఇన్సూరెన్స్ ను వాడుకోనున్నట్లు చెప్పుకొచ్చింది.



Click it and Unblock the Notifications











