రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, వైకుంఠ ఏకాదశి రోజు రూ.7.68 కోట్లు

వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

వైకుంఠ ఏకాదశి రోజు మహా విష్ణువును దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని, సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా గుండా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శన సౌభాగ్యం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలు భక్తులు పోటెత్తారు.

Tirumala Tirupati Temple Records Over Rs 7.6 Crore Hundi Collection On Vaikunta Ekadasi

తిరుమలకు వచ్చిన భక్తులు తమ శక్తి మేర స్వామి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. అలా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలు వచ్చిన భక్తులు భారీ స్థాయిలో కానుకలు, విరాళాలు సమర్పించారు.

దీంతో తిరుమల ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. కరోనా సమయం నుండి పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతించగా అదే స్థాయిలో హుండీ ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితులు స్థిమిత పడటంతో భక్తుల రాక పెరిగిపోయింది. దాంతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది.

Tirumala Tirupati Temple Records Over Rs 7.6 Crore Hundi Collection On Vaikunta Ekadasi

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం:

వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 23వ తేదీన రూ.6.31 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక హుండీ ఆదాయం రికార్డుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకాదశికి ఆ రికార్డు బ్రేక్ అయింది.

Tirumala Tirupati Temple Records Over Rs 7.6 Crore Hundi Collection On Vaikunta Ekadasi

తిరుమల ఆలయానికి వచ్చిన రికార్డు స్థాయి ఆదాయం:

* రూ. 7.68 కోట్లు - జనవరి 2, 2023
* రూ. 6.31 కోట్లు - అక్టోబర్ 23, 2022
* రూ. 6.28 కోట్లు - జులై 27, 2018
* రూ. 5.73 కోట్లు - ఏప్రిల్ 1, 2012
* రూ. 4.23 కోట్లు - జనవరి 1, 2012

Story first published: Wednesday, January 4, 2023, 12:10 [IST]
Desktop Bottom Promotion