Latest Updates
-
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే!
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, వైకుంఠ ఏకాదశి రోజు రూ.7.68 కోట్లు
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
వైకుంఠ ఏకాదశి రోజు మహా విష్ణువును దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని, సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా గుండా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శన సౌభాగ్యం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలు భక్తులు పోటెత్తారు.

తిరుమలకు వచ్చిన భక్తులు తమ శక్తి మేర స్వామి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. అలా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలు వచ్చిన భక్తులు భారీ స్థాయిలో కానుకలు, విరాళాలు సమర్పించారు.
దీంతో తిరుమల ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. కరోనా సమయం నుండి పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతించగా అదే స్థాయిలో హుండీ ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితులు స్థిమిత పడటంతో భక్తుల రాక పెరిగిపోయింది. దాంతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది.

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం:
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 23వ తేదీన రూ.6.31 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక హుండీ ఆదాయం రికార్డుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకాదశికి ఆ రికార్డు బ్రేక్ అయింది.

తిరుమల ఆలయానికి వచ్చిన రికార్డు స్థాయి ఆదాయం:
* రూ. 7.68 కోట్లు - జనవరి 2, 2023
* రూ. 6.31 కోట్లు - అక్టోబర్ 23, 2022
* రూ. 6.28 కోట్లు - జులై 27, 2018
* రూ. 5.73 కోట్లు - ఏప్రిల్ 1, 2012
* రూ. 4.23 కోట్లు - జనవరి 1, 2012



Click it and Unblock the Notifications











