Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, వైకుంఠ ఏకాదశి రోజు రూ.7.68 కోట్లు
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
వైకుంఠ ఏకాదశి రోజు మహా విష్ణువును దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని, సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా గుండా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శన సౌభాగ్యం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలు భక్తులు పోటెత్తారు.

తిరుమలకు వచ్చిన భక్తులు తమ శక్తి మేర స్వామి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. అలా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలు వచ్చిన భక్తులు భారీ స్థాయిలో కానుకలు, విరాళాలు సమర్పించారు.
దీంతో తిరుమల ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. కరోనా సమయం నుండి పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతించగా అదే స్థాయిలో హుండీ ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితులు స్థిమిత పడటంతో భక్తుల రాక పెరిగిపోయింది. దాంతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది.

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం:
వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి ఆలయానికి ఏకంగా రికార్డు స్థాయిలో రూ.7.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గతేడాది అక్టోబర్ 23వ తేదీన రూ.6.31 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక హుండీ ఆదాయం రికార్డుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకాదశికి ఆ రికార్డు బ్రేక్ అయింది.

తిరుమల ఆలయానికి వచ్చిన రికార్డు స్థాయి ఆదాయం:
* రూ. 7.68 కోట్లు - జనవరి 2, 2023
* రూ. 6.31 కోట్లు - అక్టోబర్ 23, 2022
* రూ. 6.28 కోట్లు - జులై 27, 2018
* రూ. 5.73 కోట్లు - ఏప్రిల్ 1, 2012
* రూ. 4.23 కోట్లు - జనవరి 1, 2012



Click it and Unblock the Notifications