Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Viral Videos : రైల్వే కప్లింగ్లోకి దూరుతున్న ప్రయాణికులు.. ఇండియన్ రైల్వే వైరల్ వీడియోలు..!
భారత రైల్వేల దుస్థితిని చూపెడుతూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఇదే నెల జూన్లో ఒడిస్సాలో బాలాసోర్ ట్రైన్ ప్రమాధంలో చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత రైల్వేలు అస్తవ్యస్తంగా వున్నాయంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్గా మారుతున్నాయ్.

కింద వున్న ఈ వీడియోలో ప్రయాణికులు లోపల రైళ్లో కిక్కిరిసిపోయారు. కనీసం నడవడానికి కూడా స్థలం లేదు. నిలబడే పరిస్థితి కూడా లేదు. అన్ని బెర్తులు నిండిపోవడమే కాకుండా రైలులోని కింద ఫ్లోర్పైన కూడా కూర్చొని వున్నారు.
ఇక్కడ మరో వీడియోలో రైలు మధ్యలో వున్న కప్లింగల్లోకి కొందరు ప్రయాణికులు దూసుకెళ్లిపోతున్నారు. వారిని అలా వెళ్లవద్దని చెప్పినా కూడా అలాగే వెళ్లడం మనం చూడవచ్చు. ప్రాణాలను ప్రయాణికులు కావాలని అరచేతిలో పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. భోగీలు నిండిపోయినా భోగీల మధ్యలో కూడా దూరి వెళ్లడం నెటిజెన్లను ఆందోళనకు గురి చేస్తోంది.
ఒక ఫారన్ టూరిస్టు భారత రైల్వేల దుస్థితిని కళ్లకు కట్టాడు. ట్రైన్ చూస్తే వందల ఏళ్ల క్రితానికి చెందినదిగా వున్నట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ట్రైన్లో కూడా వాసన పూర్తిగా కుళ్లిపోయినట్లుగా వస్తుందని తెలిపాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన భారతీయ రైల్వే నిర్మించింది. దీనినే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అని అంటాము. జమ్ము కశ్మీర్లో దీనిని నిర్మించారు. ఇటీవల ఈ రైలు బ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందోనని చాలా పరీక్షలు జరుపుతూ వుస్తున్నారు. రైలు ప్రమాదం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో కూడా వైరల్గా మారుతోంది. దీనిపై కొందరు నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందినా సామాన్యులకు సరైన రేల్వే సేవలను అందించలేకపోతున్నామని భారత రైల్వేను ప్రశ్నిస్తున్నారు.
కొన్ని రైళ్ల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా వుంది. ప్రయాణికులు స్వయంగా రైళ్ల రూఫ్ పైన నిద్రించడం చాలా భయాందోళనని కలిగిస్తోంది. ట్రైన్ రూఫ్ పైనే వీరు పడుకొని వుండడం, ఎప్పుడు కిందపడతారోనని తెలియకుండా వుండడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications