Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
Viral Videos : రైల్వే కప్లింగ్లోకి దూరుతున్న ప్రయాణికులు.. ఇండియన్ రైల్వే వైరల్ వీడియోలు..!
భారత రైల్వేల దుస్థితిని చూపెడుతూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఇదే నెల జూన్లో ఒడిస్సాలో బాలాసోర్ ట్రైన్ ప్రమాధంలో చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత రైల్వేలు అస్తవ్యస్తంగా వున్నాయంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్గా మారుతున్నాయ్.

కింద వున్న ఈ వీడియోలో ప్రయాణికులు లోపల రైళ్లో కిక్కిరిసిపోయారు. కనీసం నడవడానికి కూడా స్థలం లేదు. నిలబడే పరిస్థితి కూడా లేదు. అన్ని బెర్తులు నిండిపోవడమే కాకుండా రైలులోని కింద ఫ్లోర్పైన కూడా కూర్చొని వున్నారు.
ఇక్కడ మరో వీడియోలో రైలు మధ్యలో వున్న కప్లింగల్లోకి కొందరు ప్రయాణికులు దూసుకెళ్లిపోతున్నారు. వారిని అలా వెళ్లవద్దని చెప్పినా కూడా అలాగే వెళ్లడం మనం చూడవచ్చు. ప్రాణాలను ప్రయాణికులు కావాలని అరచేతిలో పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. భోగీలు నిండిపోయినా భోగీల మధ్యలో కూడా దూరి వెళ్లడం నెటిజెన్లను ఆందోళనకు గురి చేస్తోంది.
ఒక ఫారన్ టూరిస్టు భారత రైల్వేల దుస్థితిని కళ్లకు కట్టాడు. ట్రైన్ చూస్తే వందల ఏళ్ల క్రితానికి చెందినదిగా వున్నట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ట్రైన్లో కూడా వాసన పూర్తిగా కుళ్లిపోయినట్లుగా వస్తుందని తెలిపాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన భారతీయ రైల్వే నిర్మించింది. దీనినే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అని అంటాము. జమ్ము కశ్మీర్లో దీనిని నిర్మించారు. ఇటీవల ఈ రైలు బ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందోనని చాలా పరీక్షలు జరుపుతూ వుస్తున్నారు. రైలు ప్రమాదం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో కూడా వైరల్గా మారుతోంది. దీనిపై కొందరు నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందినా సామాన్యులకు సరైన రేల్వే సేవలను అందించలేకపోతున్నామని భారత రైల్వేను ప్రశ్నిస్తున్నారు.
కొన్ని రైళ్ల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా వుంది. ప్రయాణికులు స్వయంగా రైళ్ల రూఫ్ పైన నిద్రించడం చాలా భయాందోళనని కలిగిస్తోంది. ట్రైన్ రూఫ్ పైనే వీరు పడుకొని వుండడం, ఎప్పుడు కిందపడతారోనని తెలియకుండా వుండడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications











