Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మరణించిన తరువాత జరిగేది అదేనా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది..
మరణించిన తరువాత అసలేమి జరుగుతుందనే ప్రశ్న అనుమానం చాలా మందిని వేధిస్తుంది. శాస్త్రీయంగా మరణించిన తరువాత మనిషి శరీరం మట్టిలో లేదా బూడిదలో కలిసిపోతుంది. కానీ దీనిని ఆస్థికులు, కొందరు మేధావులు ఒప్పుకోవడం లేదు. మనిషి శరీరంలోపల ఆత్మ ఉంటుందని అది మళ్లీ జన్మ తీసుకుంటుందని అంటారు. మరికొందరు అది వేరే లోకాలకు ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

కర్మలు
మనిషి తన జీవితంలో చేసిన పనులనప్నీ కలిసి కర్మలుగా మనిషి మరణించే సమయానికి అతనితో ఉంటాయ్. ఒక్కసారి మనిషి మరణించాగే శరీరం కుళ్లిపోవడమో, కాలిపోవడమో జరుగుతంది కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ లేదా ప్రాణం వేరే శరీరంలో ప్రవేశించడానికి కొత్తగా మరో గర్భాన్ని వెతుక్కుంటుందని ఇషా యోగా సెంటర్ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్ చెబుతున్నారు. హిందూ పురాణాల్లో కూడా చెప్పింది కూడా ఇదే. భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతాడు. ఒక శరీరం పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ఎలాగైతే ధరిస్తుందో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు.
వేరే శరీరం కోసం వెతుకులాట
జీవితాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకొని మరణించినవారు వెంటనే మళ్లీ పుట్టడానికి వేరే శరీరాన్ని వెతుక్కుంటారు. కానీ అనుకున్న కోరికలు తీరకుండా, తీవ్రమైన బాధలో మరణించిన వారి ఆత్మలు వేరే శరీరంలోకి ప్రవేశించడానికి సమయం తీసుకుంటుందని, అలాంటి ఆత్మలనే దయ్యాలుగా పరిగణిస్తామని శాస్త్రాలు చెబుతున్నాయ్.
మళ్లీ పుట్టుక
మరణించిన తరువాత మళ్లీ భూమిపైనే పుడతాము. చేసుకున్న కర్మలను బట్టి మనిషి మళ్లీ పుడతాడు. గత జన్మకు సంబంధించినవి ఏవీ గుర్తుండవు. పుట్టిన ప్రతీ సారీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ప్రస్తుతం ఉన్న సమయాన్ని జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపితే ఆనందంగా ఉంటాడు. అదే స్వర్గం. సమయాన్ని వృధా చేసుకుంటూ గడిపితే ఆనందాన్ని అనుభవించలేడు.
మరణం తరువాత వేరే లోకం
మరణించిన తరువాత వేరే ప్రపంచం ఏదీ లేదని శరీరం పనిచేయకుండా అయిపోతుందనే అంటారు. పునర్జన్మలను, ఆత్మలను, స్వర్గం, నరకాన్ని కొట్టిపారేస్తుంటారు. అలాంటి ఎన్నో ప్రశ్నలను ఒకే సమాధానన్ని ఇస్తున్నారు. మనిషి మెదడు చాలా విషయాలను పసిగట్టడానికి, పరిశీలించడానికి సామర్ధ్యాన్ని కలిగి లేవు. కాంతి వేగాన్ని, విద్యుత్తును పరికరాలు పసిగట్టినంతగా మనిషికి సాధ్యం కాదు. కాబట్టి మనిషి కూడా అన్ని అంశాలను తెలుసుకోలేడు. మరణించిన తరువాత ఏమవుతుందనే ఎన్నో మిస్టరీలను మనిషి సులభంగా తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి చూడలేకపోవడం వల్ల అక్కడున్న దానిని లేదని చెప్పలేము.
పైన చెప్పబడిన విషయాలన్నింటినీ కొందరు ప్రముఖులు, నిపుణులు చెప్పిన విషయాల నుంచి సేకరించి చెప్పబడిందే కానీ సొంతంగా ఎలాంటి అభిప్రాయమూ తెలపలేదు.



Click it and Unblock the Notifications











