Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మరణించిన తరువాత జరిగేది అదేనా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది..
మరణించిన తరువాత అసలేమి జరుగుతుందనే ప్రశ్న అనుమానం చాలా మందిని వేధిస్తుంది. శాస్త్రీయంగా మరణించిన తరువాత మనిషి శరీరం మట్టిలో లేదా బూడిదలో కలిసిపోతుంది. కానీ దీనిని ఆస్థికులు, కొందరు మేధావులు ఒప్పుకోవడం లేదు. మనిషి శరీరంలోపల ఆత్మ ఉంటుందని అది మళ్లీ జన్మ తీసుకుంటుందని అంటారు. మరికొందరు అది వేరే లోకాలకు ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

కర్మలు
మనిషి తన జీవితంలో చేసిన పనులనప్నీ కలిసి కర్మలుగా మనిషి మరణించే సమయానికి అతనితో ఉంటాయ్. ఒక్కసారి మనిషి మరణించాగే శరీరం కుళ్లిపోవడమో, కాలిపోవడమో జరుగుతంది కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ లేదా ప్రాణం వేరే శరీరంలో ప్రవేశించడానికి కొత్తగా మరో గర్భాన్ని వెతుక్కుంటుందని ఇషా యోగా సెంటర్ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్ చెబుతున్నారు. హిందూ పురాణాల్లో కూడా చెప్పింది కూడా ఇదే. భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతాడు. ఒక శరీరం పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ఎలాగైతే ధరిస్తుందో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు.
వేరే శరీరం కోసం వెతుకులాట
జీవితాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకొని మరణించినవారు వెంటనే మళ్లీ పుట్టడానికి వేరే శరీరాన్ని వెతుక్కుంటారు. కానీ అనుకున్న కోరికలు తీరకుండా, తీవ్రమైన బాధలో మరణించిన వారి ఆత్మలు వేరే శరీరంలోకి ప్రవేశించడానికి సమయం తీసుకుంటుందని, అలాంటి ఆత్మలనే దయ్యాలుగా పరిగణిస్తామని శాస్త్రాలు చెబుతున్నాయ్.
మళ్లీ పుట్టుక
మరణించిన తరువాత మళ్లీ భూమిపైనే పుడతాము. చేసుకున్న కర్మలను బట్టి మనిషి మళ్లీ పుడతాడు. గత జన్మకు సంబంధించినవి ఏవీ గుర్తుండవు. పుట్టిన ప్రతీ సారీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాడు. ప్రస్తుతం ఉన్న సమయాన్ని జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపితే ఆనందంగా ఉంటాడు. అదే స్వర్గం. సమయాన్ని వృధా చేసుకుంటూ గడిపితే ఆనందాన్ని అనుభవించలేడు.
మరణం తరువాత వేరే లోకం
మరణించిన తరువాత వేరే ప్రపంచం ఏదీ లేదని శరీరం పనిచేయకుండా అయిపోతుందనే అంటారు. పునర్జన్మలను, ఆత్మలను, స్వర్గం, నరకాన్ని కొట్టిపారేస్తుంటారు. అలాంటి ఎన్నో ప్రశ్నలను ఒకే సమాధానన్ని ఇస్తున్నారు. మనిషి మెదడు చాలా విషయాలను పసిగట్టడానికి, పరిశీలించడానికి సామర్ధ్యాన్ని కలిగి లేవు. కాంతి వేగాన్ని, విద్యుత్తును పరికరాలు పసిగట్టినంతగా మనిషికి సాధ్యం కాదు. కాబట్టి మనిషి కూడా అన్ని అంశాలను తెలుసుకోలేడు. మరణించిన తరువాత ఏమవుతుందనే ఎన్నో మిస్టరీలను మనిషి సులభంగా తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి చూడలేకపోవడం వల్ల అక్కడున్న దానిని లేదని చెప్పలేము.
పైన చెప్పబడిన విషయాలన్నింటినీ కొందరు ప్రముఖులు, నిపుణులు చెప్పిన విషయాల నుంచి సేకరించి చెప్పబడిందే కానీ సొంతంగా ఎలాంటి అభిప్రాయమూ తెలపలేదు.



Click it and Unblock the Notifications