పిల్లలు తల్లితండ్రుల మాట వినాలంటే!

By B N Sharma

Smiling
పిల్లల్ని సవ్యంగా పెంచాలంటే వారితో తల్లితండ్రులు గట్టి అనుబంధం ఏర్పరచుకోవాలి. ఈ అనుబంధం వారిమధ్య ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి టీన్ ఏజ్ లో తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య ఈ అనుబంధం అవసరం ఎంతో వుంటుంది. తండ్రికి, తల్లికి అతి దగ్గరగా వున్న పిల్లలు వారు చెప్పే ఆదేశాలను ఎప్పటికపుడు ఆచరిస్తారు. ఈ బంధం కొరవడితే అవిధేయత కొట్టవచ్చినట్లు కనపడుతుంది. అదే జరిగితే, ఇక పేరెంట్ ముఖంలో పిల్లల అలవాట్లు నియంత్రించలేని అసమర్ధత కొట్టోచ్చినట్లు కనపడుతుంది.

ఈ ఒక్క అనుబంధమనే సాధనం పిల్లలు టీనేజ్ దాటినప్పటికి సమర్ధవంతంగా వారి జ్ఞాపకాలలో మిగిలిపోతుంది. పిల్లల అలవాట్ల నియంత్రణలో అన్ని సాధనాలు నిరుపయోగమైనప్పటికి అనుబంధమనే సాధనం అద్భుతంగా పనిచేస్తూనే వుంటుంది. ఇది లేని తల్లితండ్రులు ఎంతో విలువైన బంధాన్ని తమ పిల్లలపట్ల కోల్పోయినట్లే.

ఈ అనుబంధం బిడ్డ మానసిక స్ధిరత్వానికి కూడా అత్యవసరమైంది. ఇటీవలే చేసిన ఒక స్టడీ మేరకు చిన్నతనంలో తల్లితండ్రుల అనుబంధం లోపించిన పిల్లలు తమ నలభై ఏళ్ళ వయసులో కూడా కొత్త వాతావరణంపట్ల, కొత్త వ్యక్తులతో సమాజంలో మెలగటం పట్ల తీవ్ర అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడతారనేది వెల్లడైంది. మరి ఈ తల్లితండ్రుల - బిడ్డల అనుబంధం ఎలా ఏర్పడుతుంది. అది బిడ్డల శిశువు దశలోనే వారి ఆలనా పాలనా చూస్తుండటంతో, శారీరక స్పర్శలతో మాత్రమే ఏర్పడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

Story first published: Thursday, January 5, 2012, 13:22 [IST]
Desktop Bottom Promotion