Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
ఆలస్య ప్రసవాలు....సమస్యలు లేని బిడ్డలు!

ఈ దిశగా చేసిన స్టడీ చాలా విస్తృతంగా చేయబడింది.ఈ వార్తను చాలామంది ప్రజారోగ్య సంస్ధలు, వైద్య సిబ్బందులు ప్రచారం చేశారు. మహిళలో కాన్పులు త్వరగా అవాలని కోరుకోవటం సరికాదని, గర్భవతులు 37 నుండి 41 వారాలలోపు ప్రసవిస్తూంటారని, అది శారీరక ధర్మం అని మార్చ్ ఆఫ్ డైమ్స్ మెడికల్ డైరెక్టర్ అలన్ ఫ్లీష్ మన్ తెలిపారు. వైద్య పరంగా ఎంతో అవసరముంటే కాని ఈ శారీరక ధర్మంలో జోక్యం చేసుకోరాదని కూడా వారు తెలిపారు.
37 నుండి 40 వారాల గర్భంతో ప్రసవించిన బేబీల మరణాలను వారు విశ్లేషించారు. 40 వారాల సమయం పూర్తి గర్భదశ కాలమని, కాని చాలామంది 37 నుండి 38 వారాలుగా లేదా అంతకు తక్కువగా వుండాలని భావిస్తారని 37 వారాలలోపు పుట్టిన బిడ్డలను ముందస్తుగా పుట్టిన వారిగా పరిగణించాలన్నారు.
అయితే 37 వారాలకు పుట్టిన బిడ్డలకు 40 వారాలకు పుట్టిన బిడ్డలతో పోలిస్తే రిస్కు అధికంగా వుందన్నారు. 37 వారాల వారిలో ప్రతి వేయి మంది బేబీలకు 3.9 శాతం మరణాలుండగా 40 వారాలకు పుట్టిన వారిలో ప్రతి వేయి మంది జననానికి 1.9 మరణ శాతమేనని తెలిపారు. అయితే, వైద్య అవసరాల కారణంగా అతి త్వరగా అంటే 39 వారాలకే ప్రసవం చేయవచ్చని, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్ స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ సంస్ధ తెలుపుతోంది.
37 వారాలకే పుట్టిన పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని వారికి వెంటిలేషన్ ఏర్పరచాల్సిన అవసరం వుంటోందని తెలిపారు. అంతేకాక వీరిలో కామెర్లవంటివి, లేదా బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలియపరచారు. కొన్ని సార్లు తల్లి త్వరిత కాన్పు కోరగా మరికొన్ని కేసులలో వైద్యులు త్వరిత కాన్పులను సూచిస్తున్నారని ఇది సరికాదని, బేబీకి పూర్తిగా 40 వారాలపాటు గర్భంలో వుండే సౌకర్యం వుంటుందని, ఈ శారీరక ధర్మం పాటిస్తే, పుట్టబోయే బిడ్డలకు సమస్యలుండవని రీసెర్చర్లు తెలిపారు.



Click it and Unblock the Notifications