Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
గర్భిణీలు పుస్తకాలు చదవాలని, మంత్రాలు పఠించాలని ఎందుకు చెబుతారు?
గర్భిణీలు సుందరకాండ, రామాయణం వంటి ఇతిహాసాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. పురాణ ఇతిహాసాలు చదివితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని పేర్కొన్నారు. గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ అయిన తమిళిసై.. ఓ కార్యక్రమం సందర్భంగా ఈ సలహా ఇచ్చారు.
గర్భధారణ సమయంలో సుందరకాండ చదివితే పిల్లలకు చాలా మంచిదని ఆమె తెలిపారు. రామాయణంలో ఓ అధ్యాయమైన సుందరకాండలో హనుమంతుని సాహసాలు, ఆయన నిస్వార్థత, బలం, శ్రీరాముని పట్ల భక్తి గురించి ఉంటుంది. ఇది చదివితే మానసికంగా దృఢత్వం కలిగిన పిల్లలు పుడతారని గవర్నర్ సూచించారు.

గర్భధారణ సమయంలో పుస్తకాలు చదివితే ప్రయోజనాలు:
గర్భధారణ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. పుస్తక పఠనం రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. పుస్తక పఠనం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ముందే తెలుసుకోవచ్చు. ఇతరుల అనుభవాల గురించి చదవడం ద్వారా, గర్భం, ప్రసవం యొక్క వివిధ దశల గురించి, అలాగే పిల్లలను పెంచడంలో సవాళ్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రసవం జరిగినప్పుడు మరింత సన్నద్ధతతో, తక్కువ ఒత్తిడితో ఉండవచ్చు.
మంత్రాలు పఠించడం:
మంత్రాలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూజాది కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో దేవుడిని స్మరిస్తూ చేసేవి మంత్రాలు. అవి మనస్సును శాంతపరచడానికి శక్తివంతమైన మార్గంగా పరిగణించబడుతున్నాయి. మంత్రాలు పఠించడం వల్ల సానుకూల ప్రకంపనలు విడుదలై అవి గర్భంలోని శిశువుకు మేలు చేస్తాయని అంటారు. అది శిశువు మానసిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మంత్రాలు పఠించడం ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. అది నాణ్యమైన నిద్రను అందిస్తాయి.
- ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది
- మెరుగైన నిద్ర అందుతుంది
- స్వీయ అవగాహ, విశ్వాసం పెరుగుతుంది
- భావోద్వేగ శ్రేయస్సు మెరుగుపడుతుంది
- శిశువుతో మెరుగైన బంధం ఏర్పడుతుంది
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











