Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
గర్భిణీలు పుస్తకాలు చదవాలని, మంత్రాలు పఠించాలని ఎందుకు చెబుతారు?
గర్భిణీలు సుందరకాండ, రామాయణం వంటి ఇతిహాసాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. పురాణ ఇతిహాసాలు చదివితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని పేర్కొన్నారు. గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ అయిన తమిళిసై.. ఓ కార్యక్రమం సందర్భంగా ఈ సలహా ఇచ్చారు.
గర్భధారణ సమయంలో సుందరకాండ చదివితే పిల్లలకు చాలా మంచిదని ఆమె తెలిపారు. రామాయణంలో ఓ అధ్యాయమైన సుందరకాండలో హనుమంతుని సాహసాలు, ఆయన నిస్వార్థత, బలం, శ్రీరాముని పట్ల భక్తి గురించి ఉంటుంది. ఇది చదివితే మానసికంగా దృఢత్వం కలిగిన పిల్లలు పుడతారని గవర్నర్ సూచించారు.

గర్భధారణ సమయంలో పుస్తకాలు చదివితే ప్రయోజనాలు:
గర్భధారణ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. పుస్తక పఠనం రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. పుస్తక పఠనం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ముందే తెలుసుకోవచ్చు. ఇతరుల అనుభవాల గురించి చదవడం ద్వారా, గర్భం, ప్రసవం యొక్క వివిధ దశల గురించి, అలాగే పిల్లలను పెంచడంలో సవాళ్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రసవం జరిగినప్పుడు మరింత సన్నద్ధతతో, తక్కువ ఒత్తిడితో ఉండవచ్చు.
మంత్రాలు పఠించడం:
మంత్రాలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూజాది కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో దేవుడిని స్మరిస్తూ చేసేవి మంత్రాలు. అవి మనస్సును శాంతపరచడానికి శక్తివంతమైన మార్గంగా పరిగణించబడుతున్నాయి. మంత్రాలు పఠించడం వల్ల సానుకూల ప్రకంపనలు విడుదలై అవి గర్భంలోని శిశువుకు మేలు చేస్తాయని అంటారు. అది శిశువు మానసిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మంత్రాలు పఠించడం ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. అది నాణ్యమైన నిద్రను అందిస్తాయి.
- ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది
- మెరుగైన నిద్ర అందుతుంది
- స్వీయ అవగాహ, విశ్వాసం పెరుగుతుంది
- భావోద్వేగ శ్రేయస్సు మెరుగుపడుతుంది
- శిశువుతో మెరుగైన బంధం ఏర్పడుతుంది
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications