Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
గర్భిణీలు పుస్తకాలు చదవాలని, మంత్రాలు పఠించాలని ఎందుకు చెబుతారు?
గర్భిణీలు సుందరకాండ, రామాయణం వంటి ఇతిహాసాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. పురాణ ఇతిహాసాలు చదివితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని పేర్కొన్నారు. గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ అయిన తమిళిసై.. ఓ కార్యక్రమం సందర్భంగా ఈ సలహా ఇచ్చారు.
గర్భధారణ సమయంలో సుందరకాండ చదివితే పిల్లలకు చాలా మంచిదని ఆమె తెలిపారు. రామాయణంలో ఓ అధ్యాయమైన సుందరకాండలో హనుమంతుని సాహసాలు, ఆయన నిస్వార్థత, బలం, శ్రీరాముని పట్ల భక్తి గురించి ఉంటుంది. ఇది చదివితే మానసికంగా దృఢత్వం కలిగిన పిల్లలు పుడతారని గవర్నర్ సూచించారు.

గర్భధారణ సమయంలో పుస్తకాలు చదివితే ప్రయోజనాలు:
గర్భధారణ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. పుస్తక పఠనం రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. పుస్తక పఠనం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ముందే తెలుసుకోవచ్చు. ఇతరుల అనుభవాల గురించి చదవడం ద్వారా, గర్భం, ప్రసవం యొక్క వివిధ దశల గురించి, అలాగే పిల్లలను పెంచడంలో సవాళ్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రసవం జరిగినప్పుడు మరింత సన్నద్ధతతో, తక్కువ ఒత్తిడితో ఉండవచ్చు.
మంత్రాలు పఠించడం:
మంత్రాలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూజాది కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో దేవుడిని స్మరిస్తూ చేసేవి మంత్రాలు. అవి మనస్సును శాంతపరచడానికి శక్తివంతమైన మార్గంగా పరిగణించబడుతున్నాయి. మంత్రాలు పఠించడం వల్ల సానుకూల ప్రకంపనలు విడుదలై అవి గర్భంలోని శిశువుకు మేలు చేస్తాయని అంటారు. అది శిశువు మానసిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మంత్రాలు పఠించడం ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. అది నాణ్యమైన నిద్రను అందిస్తాయి.
- ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది
- మెరుగైన నిద్ర అందుతుంది
- స్వీయ అవగాహ, విశ్వాసం పెరుగుతుంది
- భావోద్వేగ శ్రేయస్సు మెరుగుపడుతుంది
- శిశువుతో మెరుగైన బంధం ఏర్పడుతుంది
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications