Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
బెంగుళూరు అనగానే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు టక్కున గుర్తొచ్చేది అక్కడి స్ట్రీట్ ఫుడ్. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెన్నె మసాలా దోశ(బట్టర్ మసాలా దోశ). దీని రుచి చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటూ, స్వచ్ఛమైన వెన్న సువాసనతో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఆ దోశను ఇష్టపడని వారుండరు.
ఎప్పుడూ రెస్టారెంట్లకు వెళ్లి తినడమే కాకుండా, అదే పక్కా బెంగుళూరు హోటల్ రుచితో మన ఇంట్లోనే చాలా సులభంగా ఈ దోశను తయారు చేసుకోవచ్చు. బెంగుళూరు స్టైల్ బెన్నె మసాలా దోశ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
బెన్నె మసాలా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
దోశ బియ్యం - 2 కప్పులు (కటోరి)
ఉప్పుడు బియ్యం- పావు కప్పు
మినపప్పు - పావు కప్పు
మెంతులు - పావు టీస్పూన్
అటుకులు- పావు కప్పు
బియ్యం పిండి - 2 కప్పులు
చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
వెన్న - తగినంత
బెన్నె మసాలా దోశ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో 2 కప్పుల దోశ బియ్యం, పావు కప్పు ఉప్పుడు బియ్యం, పావు కప్పు మినపప్పు, పావు టీస్పూన్ మెంతులు వేయండి. వీటన్నింటినీ నీళ్లతో 3 నుండి 4 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని మంచి నీళ్లు పోసి సుమారు 6 నుండి 7 గంటల పాటు బాగా నాననివ్వాలి.
-ఆరేడు గంటల తర్వాత నానబెట్టిన పప్పు, బియ్యం మిశ్రమంలోని నీటిని వంపేయండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన మిశ్రమాన్ని వేయాలి. దీనికి కడిగి పెట్టుకున్న పావు కప్పు అటుకులను కూడా జతచేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చాలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, రాత్రంతా (కనీసం 8 గంటలు) పులియబెట్టాలి.
-మరుసటి రోజు ఉదయానికి పిండి బాగా పులిసి ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. చక్కెర వేయడం వల్ల దోశకు ఆకర్షణీయమైన బంగారు రంగు (బ్రౌన్ కలర్) వస్తుంది. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశల పిండి స్థిరత్వానికి సర్దుబాటు చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఐరన్ (ఇనుప) పెనాన్ని పెట్టుకుని బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక గరిటెతో పిండిని తీసుకుని కాస్త మందంగా పెనం మొత్తం వ్యాపించేలా దోశ వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనెతో పాటు, రుచిని రెట్టింపు చేసే తెల్ల వెన్నను వేయండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, దోశ అంచులు ఎర్రగా, కరకరలాడేలా వేగే వరకు కాల్చుకోవాలి.
-దోశ బాగా కాలి అద్భుతమైన రంగులోకి రాగానే, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ కర్రీ ను దోశ మధ్యలో ఉంచి రెండు వైపులా మడవాలి.
-అంతే ఘుమఘుమలాడే వేడి వేడి బెంగుళూరు స్టైల్ బెన్నె మసాలా దోశ రెడీ. ఈ దోశను వెంటనే మీకు ఇష్టమైన పల్లీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే, ఆ రుచికి ఇంట్లో వాళ్లంతా వహ్వా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











