Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఎగ్ బిర్యానీ

కోడిగుడ్లు: 6(ఉడకబెట్టి, నిలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2
టొమోటో: 1
కొత్తిమీర: 1/2cup
పుదీనా: 1/2cup
నెయ్యి: 2tbsp
ఆయిల్: 2tbsp
పెరుగు: 1 cup
పచ్చిమిర్చి: 6
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2 tsp
దనియా పౌడర్: 2tsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కుంకుమపువ్వు: 1/2tsp(గోరువెచ్చని పాలలో నానబెట్టాలి)
అన్న వండడానికి కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 3cup, లవంగాలు: 4, ఏలకులు: 5, ఉప్పు: కొద్దిగా, ఆయిల్: 1 tbsp, మారాటి మొగ్గ: 2, బిర్యానీ ఆకుల:2, నీళ్లు: సరిపడా.
బిర్యానీ మసాలా: లవంగాలు: 4, దాల్చిన చెక్క: 1, షాజీరా :1/2 tsp, మిరియాలు:5(పై పదార్థాలు పొడి చేసుకోవాలి)
తయారు చేయు విధానము:
1. బాస్మతి బియ్యంలో సరిపడా నీటిని పోసి, లవంగాలు, ఏలకులులు, బిర్యానీ ఆకు, మరాటి మొగ్గ, పుదీనా, నూనె, ఉప్పు వేసి అన్న వండాలి.
2. తర్వాత వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చాలి. పాత్రలో నెయ్యి, ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి లేత ఎరుపురంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. పచ్చిమిర్చి అల్లం, వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత ఒకటి వేసి 2 నిమిషాలు వేయించాలి. కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
4. తర్వాత టమోటో, కోడిగుడ్లు వేసి మిగతా పదార్థాలతో పాటు కలిసేలా వేయించాలి. ఇప్పుడు పెరుగు, నిమ్మరసం వేసి అయిదు నిమిషాలపాటు వేయించి దింపేయాలి.
5. ఒకపాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తర్వత మొదటగా తయారు చేసి పెట్టుకొన్న అన్నం అందులో వేయాలి.
6. తర్వాత దాని మీద కోడిగుడ్డు మసాలి వేసి స్ర్పెడ్ చేయాలి. తర్వాత మిగతా అన్నం, మసాలా కూడా ఇలాగే వేయాలి. ఆపై నెయ్యి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వుచిలకరించి, కొత్తిమీర చల్లి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి.
7. తర్వాత పెనం వేడి చేసి దాని మీద బిర్యానీ పాత్ర పెట్టి చిన్న మంట మీద 15నిమిషాల పాటు ఉంచి దింపేయాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ. ఇష్టమైన కాంబినేషన్ తో వడ్డించాలి.



Click it and Unblock the Notifications











