‘మెగులాయ్ మటన్ బిర్యాని’ లాగించేద్దామా..!!

Mughlai Mutton Biryani
సాధారణ బిర్యాని తినాలంటే బోర్ కొడుతుందా..? పండుగ పూట కొత్త రుచులను కొత్త ఆస్వాధించాలని ఉందా..? అయితే ఇంకెందుకుండి ఆలస్యం మీ కోసం 'వన్ ఇండియా' అందిస్తున్న మెగులాయ్ మటన్ బిర్యానీ వంటకాన్ని ట్రై చేసి చూడండి మరీ..!!

తయారీకి కావల్సిన పదార్ధాలు:
- బాసుమతి రైసు (1 కప్పు)
- తాజా మటన్ (1కప్పు)
- 3 మధ్య సైజు ఉల్లిపాయలు
- వెల్లులి రెబ్బలు 6.
- అల్లం తగినంత.
- జీడిపప్పులు.
- పచ్చిమర్చి 6 (సన్నగా తరిగినవి).
- కారం రెండు టేబుల్ స్పూన్లు.
- పెరుగు 1కప్పు.
- కొత్తి మీర (సన్నగా తరిగినది).
- పుదీనా (సన్నగా తరిగినది).
- 1 కప్పు నెయ్యి.
- నీళ్లు ( బియ్యాన్ని ఉడికించేందుకు).
- కుంకుమ పువ్వు 6 రెబ్బలు ( వేయించి, పాలలో నానబెట్టినవి).
- సాల్ట్ తగినంత.

బిర్యానీ తయారీకి కావల్సిన దినుసులు:
- 1 టేబుల్ స్పూప్ జీలకర్ర
- 2 యాలుకులు దంచినవి
- లవంగం మొగ్గలు 3
- దాల్చిన చెక్క
- ఉడకబెట్టిన గుడ్డులు 3,
- వేయించిన బాదాం పప్పులు 10,

తయారీ విధానం:
- ముందుగా ఒక ఉల్లిపాయ, వెల్లులి, అల్లం, జీడిపప్పులను మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- పాన్ పై నెయ్యిను వేడి చేసి అందులో మిగిలిన ఉల్లిపాయలను ముక్కలను వేయించుకుని పక్కనపెట్టుకోండి.
- అదే నెయ్యిలో మటన్ ను వేసి ముక్కులను వేగనిచ్చి వేరుగా పెట్టుకోండి.
- అదే నెయ్యిలో ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం, వెల్లులి పేస్ట్ ను వేయించండి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు.
- ఈ వేయించిన పేస్ట్ మిశ్రమంలో, ముందుగా వేయించి పెట్టుకున్నమటన్ తో పాటు పెరుగు, తగినంత నీరు, సాల్ట్ ను వేసి 20 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించండి.
- తయారైన మిశ్రమంలో దంచిపెట్టకున్న దినుసులును కలుపుకోండి.
- మెతుకులు అంటకుండా బియ్యాన్ని ఉడికించి సిద్ధం చేసుకోవాలి.
- అనంతరం బాండీని తీసుకుని కింద భాగంలో కొంత మంసపు మిశ్రమాన్ని వేసి పై భాగంలో ఉడికిన రైస్ ను వేయాలి. ఆ పై పొరలో ఉల్లి, బాదాం పొప్పులు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా పొరలను అమర్చుకుంటూ రావాలి.
- ఇలా పొరలను అమర్చుకున్న తరువాత బాండీ పై మూతపెట్టి 30 నిమిషాల పాటు ఉడికించాలి.
- మీరు ఎదురుచూస్తున్న మటన్ బిర్యాని తయార్, సిద్ధంగా ఉంచుకున్న పదార్థాలతో బిర్యానిని అలకంరించి వేడి వేడిగా వడ్డించుకోండి.

Story first published: Wednesday, August 31, 2011, 15:15 [IST]
Desktop Bottom Promotion