Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
‘మెగులాయ్ మటన్ బిర్యాని’ లాగించేద్దామా..!!

తయారీకి కావల్సిన పదార్ధాలు:
- బాసుమతి రైసు (1 కప్పు)
- తాజా మటన్ (1కప్పు)
- 3 మధ్య సైజు ఉల్లిపాయలు
- వెల్లులి రెబ్బలు 6.
- అల్లం తగినంత.
- జీడిపప్పులు.
- పచ్చిమర్చి 6 (సన్నగా తరిగినవి).
- కారం రెండు టేబుల్ స్పూన్లు.
- పెరుగు 1కప్పు.
- కొత్తి మీర (సన్నగా తరిగినది).
- పుదీనా (సన్నగా తరిగినది).
- 1 కప్పు నెయ్యి.
- నీళ్లు ( బియ్యాన్ని ఉడికించేందుకు).
- కుంకుమ పువ్వు 6 రెబ్బలు ( వేయించి, పాలలో నానబెట్టినవి).
- సాల్ట్ తగినంత.
బిర్యానీ తయారీకి కావల్సిన దినుసులు:
- 1 టేబుల్ స్పూప్ జీలకర్ర
- 2 యాలుకులు దంచినవి
- లవంగం మొగ్గలు 3
- దాల్చిన చెక్క
- ఉడకబెట్టిన గుడ్డులు 3,
- వేయించిన బాదాం పప్పులు 10,
తయారీ విధానం:
- ముందుగా ఒక ఉల్లిపాయ, వెల్లులి, అల్లం, జీడిపప్పులను మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- పాన్ పై నెయ్యిను వేడి చేసి అందులో మిగిలిన ఉల్లిపాయలను ముక్కలను వేయించుకుని పక్కనపెట్టుకోండి.
- అదే నెయ్యిలో మటన్ ను వేసి ముక్కులను వేగనిచ్చి వేరుగా పెట్టుకోండి.
- అదే నెయ్యిలో ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం, వెల్లులి పేస్ట్ ను వేయించండి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు.
- ఈ వేయించిన పేస్ట్ మిశ్రమంలో, ముందుగా వేయించి పెట్టుకున్నమటన్ తో పాటు పెరుగు, తగినంత నీరు, సాల్ట్ ను వేసి 20 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించండి.
- తయారైన మిశ్రమంలో దంచిపెట్టకున్న దినుసులును కలుపుకోండి.
- మెతుకులు అంటకుండా బియ్యాన్ని ఉడికించి సిద్ధం చేసుకోవాలి.
- అనంతరం బాండీని తీసుకుని కింద భాగంలో కొంత మంసపు మిశ్రమాన్ని వేసి పై భాగంలో ఉడికిన రైస్ ను వేయాలి. ఆ పై పొరలో ఉల్లి, బాదాం పొప్పులు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా పొరలను అమర్చుకుంటూ రావాలి.
- ఇలా పొరలను అమర్చుకున్న తరువాత బాండీ పై మూతపెట్టి 30 నిమిషాల పాటు ఉడికించాలి.
- మీరు ఎదురుచూస్తున్న మటన్ బిర్యాని తయార్, సిద్ధంగా ఉంచుకున్న పదార్థాలతో బిర్యానిని అలకంరించి వేడి వేడిగా వడ్డించుకోండి.



Click it and Unblock the Notifications











