Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
మెత్తని దూదుల్లాంటి రాగి ఇడ్లీ..షుగర్ పేషెంట్లకు, బరువు తగ్గేవారికి నెంబర్ 1 బ్రేక్ ఫాస్ట్!
సాధారణంగా మనం బియ్యం పిండితో ఇడ్లీలు చేసుకుంటాం. కానీ బియ్యం కంటే రాగులతో చేసిన ఇడ్లీలు ఎన్నో రెట్లు ఎక్కువ పోషకాలను అందిస్తాయి. ఇతర ఏ ధాన్యాలతో పోల్చినా రాగుల్లో కాల్షియం శాతం అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి చాలా అవసరం.
పెరుగుతున్న పిల్లలకు, ఎముకల బలహీనత ఉన్న వృద్ధులకు రాగి ఇడ్లీ ఒక దివ్యౌషధం. రాగి ఇడ్లీ డయాబెటిస్ వారికి బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్.

చాలామంది రాగి ఇడ్లీలు గట్టిగా వస్తాయని, రుచి బాగోవని అనుకుంటారు. కానీ సరైన కొలతలతో, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే మెత్తని దూదుల్లాంటి రాగి ఇడ్లీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-రాగి రవ్వ
-ఇడ్లీ రవ్వ
-మెంతులు
-మినపప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసి నీళ్లు పోసి 2-3 శుభ్రంగా కడుక్కోవాలి.
-కడిగిన తర్వాత మినపప్పు మునిగేంతవరకు నీరు పోసి,ఇందులోనే 1 టీస్పూన్ మెంతులు కూడా వేసి కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి.
-మరొక బౌల్ లో 2 కప్పుల రాగి రవ్వ, 1కప్పు ఇడ్లీ రవ్వ వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి.
-5 గంటల తర్వాత నానిన మినపప్పుని శుభ్రంగా కడిగి నీరు వంపేసి పప్పుని మిక్సీ గిన్నెలో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-తర్వాత నానిన రవ్వ మిశ్రమాన్ని నీటిని పిండేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసి చేత్తో బాగా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టేయాలి.
-తర్వాత మూత తీసి చూస్తే పిండి పొంగి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
-ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో పిండి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి జస్ట్ 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అంతే రాగి ఇడ్లీ రెడీ.
-వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరితో చేసిన చట్నీ రాగి ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్. అల్లం చట్నీ లేదా కారప్పొడితో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. కూరగాయలు వేసి చేసిన వేడి సాంబార్లో రాగి ఇడ్లీని ముంచుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications