Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే..
పొద్దున్నే నిద్రలేవగానే వేడివేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెలు తినాలన్న కోరిక కలగగానే.. మనకు ముందుగా గుర్తొచ్చేది రెస్టారెంట్లలో వడ్డించే కమ్మని చట్నీ. ఆ రుచిని ఆస్వాదించడానికి ప్రతిసారీ హోటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులభంగా, ఎంతో ఆరోగ్యకరమైన పల్లీ-కొబ్బరి చట్నీని తయారు చేసుకోవచ్చు.
పల్లీలలో ప్రోటీన్లు, కొబ్బరిలో మంచి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఈ చట్నీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని తయారు చేయడానికి పెద్దగా శ్రమ, సమయం కూడా అవసరం లేదు. పల్లీ-కొబ్బరి చట్నీని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పల్లీ-కొబ్బరి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
వేరుశెనగలు(పల్లీలు) - 200 గ్రాములు
పచ్చి కొబ్బరి - 50 గ్రాములు
శనగ పప్పు - 2 టీస్పూన్లు
పెరుగు - 2 టీస్పూన్లు
అల్లం - అర అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 3
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
తాలింపుకి నూనె - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 6 ఆకులు
పల్లీ-కొబ్బరి చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోవాలి. అందులో 200 గ్రాముల వేరుశెనగలను వేసి, తక్కువ మంటపై దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా, పచ్చివాసన పోయి గోధుమ రంగులోకి వచ్చేలా వేయించాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే పాన్ లో 2 టీస్పూన్ల శనగ పప్పును కూడా వేసి కాస్త ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో చల్లారిన వేరుశెనగలు (పొట్టు తీసి లేదా అలాగే వేసుకోవచ్చు), శనగ పప్పు వేయాలి. వాటితో పాటే 50 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా, మృదువైన పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక అందమైన గిన్నెలోకి తీసుకోవాలి. చట్నీకి కాస్త పుల్లని రుచి, కమ్మదనం కావాలనుకునే వారు ఇందులో 1-2 టీస్పూన్ల పెరుగు కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేకపోతే వదిలేయవచ్చు.
-తాలింపు వేయడం వల్ల చట్నీ రుచి రెట్టింపు అవుతుంది. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి అందులో ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి స్టవ్ కట్టేయాలి. ఈ తాలింపు సువాసన మీ వంటగది అంతా వ్యాపిస్తుంది.
-ఇప్పుడు ఆ వేడివేడి తాలింపుని మనం ముందుగా గిన్నెలోకి తీసుకున్న పల్లీ-కొబ్బరి చట్నీలో వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే పోషకభరితమైన చట్నీ రెడీ.
-ఈ చట్నీని దోసెలు, ఇడ్లీలు, వడ, బోండా లేదా ఉప్మాతో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










