కృష్ణాష్టమి స్పెషల్.. ‘తీపి వడ’..!!

Sweet Vada
కావల్సిన పదార్థాలు :
బియ్యపిండి : 3 కప్పులు,
బెల్లం : మూడున్నర కప్పులు,
అలసందలు : మూడు టేబుల్ స్పూన్లు,
కొబ్బరి తురుము : మూడు టేబుల్ స్పూన్లు,
యాలుకుల పొడి : అర టీ స్పూను,
నెయ్యి : మూడు టీ స్పూన్లు
అరటిపళ్లు : ఒకటి లేదా రెండు

తయారు చేసే విధానం :
- అలసందల్ని ముందుగానే నానబెట్టకుని కుక్కర్ లో ఉడికించుకోవాలి.
- బియ్యం పిండిని ముందుపు గిన్నెలో పోసి, వేడిని సిమిలో ఉంచి 10 నిమిషాలు పాటు ఉంచాలి.
- గిన్నెలో బెల్లం తురుము వేసి, 5 కప్పులు నీళ్లు పోసి కరిగించాలి. కరిగిన ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. ఇలా వచ్చిన బెల్లపు మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి కొబ్బరితురుము, ఉడికించిన అలసందులు, బియ్యపు పిండి కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా పోసి ఉడికించాలి. తరవాత మెత్తగా చిదిమిన అరటిపండు, యూలకుల పొడి వేసి కలిపి గట్టిపడేవరకు ఉచికించి దించి కాస్త నెయ్యి కలపాలి.
- తరువాత చేతులకు కాస్త నెయ్యి రాసుకుని ఉడికించిన మిశ్రమాన్ని ఉండలుగా చేసి వాటిని వడల్లో వత్తుకోవాలి. ఇలా వల రూపంలో వత్తిన పదార్థాన్ని, ఇడ్లీప్లేట్ల గుంతల్లో అరిటాకులు పరిచి వాటి మీద పెట్టాలి. అలా ఇడ్లీ పాత్రలో పెట్టని వడలను పది నిమిషాలు పాటు ఉడికించి దించేయాలి. వీటి మీద వెన్న రాసి కృష్ణునికి నైవేద్యంగా పెట్టాలి.

Story first published: Sunday, August 21, 2011, 13:21 [IST]
Desktop Bottom Promotion