మ్యాంగో రైస్ కీర్

రవ్వ రైస్: 1/4cup
పాలు: 3
బెల్లం: 1/4cup
మామిడి పండు: 1 లేదా 2
యాలకుల పొడి: 1tsp
బాదాం: కొన్ని

తయారు చేయు విధానం:
1. ముందుగా బాదా పప్పును నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మైక్రోవోవెన్ లో కొద్దిగా నీళ్ళు వేడి చేసి అందులో ఈ బాదం పప్పును వేసి ఐదు నిమిషాల తర్వాత బాదాం పప్పు పై పొట్టును తొలగించి పక్కన పెట్టుకోవాలి

Mango Rice Kheer
2. తర్వాత బాగా మాగిన మామిడి పండును ఒక దానికి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుని చిక్కటి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. లేదా గుజ్జులా తయారు చేసుకోవాలి. మరో మామిడి పండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ వెలిగించి చిన్న బౌల్ పెట్టిం అందులో పాలు పోసి తక్కువ మంట మీద పాలును బాగా కాచాలి. తర్వాత అందులోనే బియ్యం రవ్వను వేసి బాగా ఉడకనివ్వాలి. అవసరం అనుకొంటే కొద్దిగా నీరు పోసుకోచ్చు.
4. బియ్యం రవ్వ బాగా మెత్తగా ఉడికిందనిపించగానే క్రిందికి దింపుకొని అందులో యాలకుల పొడి, బెల్లం తురుము చేర్చాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత అందులో మ్యాంగో జ్యూస్ లేదా మ్యాంగో గుజ్జును, బాదం పలుకులు వేసి బాగా కలియబెట్టి తర్వతా పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.

సూచన: 1. స్టౌ మీద నుండి దించుకొనే ముందుగా బియ్యం రవ్వ బాగా వుడికిందో లేదా చూసుకోవాలి.
2. మామిడి పండు తియ్యదనాన్ని బట్టి బెల్లం ఎక్కువ, తక్కువ వేసుకోవాలి.

Story first published: Friday, July 20, 2012, 11:39 [IST]
Desktop Bottom Promotion