Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
తంబిట్టు : వర మహాలక్ష్మీ వ్రత స్పెషల్ డిష్
శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.
లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే! వరాలు ఇచ్చే తల్లి అంత సులువుగా కనికరిస్తుందా? ఆమెకు ప్రియమైనవి చేయాలి. నైవేద్యం పెట్టాలి. అమ్మా తల్లీ అనాలి. ఆమె ఓకే అన్నాక మనమూ ఒక స్పూను నోట్లో వేసుకోవాలి. అలాంటి ఒక స్వీట్ రిసిపి తంబిట్టు. ఇది చాలా వెరైటీగా,.. టేస్ట్ గా ఉంటుంది. ఈ స్వీట్ రిసిపి తయారుచేయడం చాలా సులభం.చాలా తక్కువ పదార్థాలను సులభంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
గోధుమపిండి: 1cup
బెల్లం: 1cup(పొడి చేసుకోవాలి)
నెయ్యి: 3/4cup
నీళ్ళు : సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో ఒక కప్పు గోధుమపిండి వేయాలి.
2. గోధుమపిండి రెడ్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. మరో పాన్ లో 2కప్పుల నీరు పోసి మరిగేటప్పుడు అందులో బెల్లం వేసి కరిగే వరకూ ఉడికించాలి. తర్వాత బెల్లం నీరు ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి.
5. ఇప్పుడు పాన్ లో బెల్లం నీళ్ళు (జాగ్రీ సిరఫ్) పోసి అందులో ఫ్రై చేసుకొన్న గోధుమపిండి వేసి బాగా కలియబెట్టాలి. ఉండలు కట్టకుండా కలియబెట్టాలి .
6. 5నిముషాలు పక్కన పెట్టాలి. తర్వాత చేతిలోకిది నెయ్యి తీసుకొని రెండు అరచేతులకు మర్ధన చేసి పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చిన్న ఉండలు చుట్టుకోవాలి. అంతే వర మహాలక్ష్మీ పూజకు ఒక స్పెషల్ అండ్ టేస్టీ స్వీట్ డిష్ రెడీ.



Click it and Unblock the Notifications