Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నవరాత్రి స్పెషల్-జిలేబీ తయారీ విధానం(స్పెషల్ వీడియో)
నవరాత్రి స్పెషల్-జిలేబీ తయారీ విధానం(వీడియో)
మనలో చాలా మందికి జిలేబీలు ఇష్టమైన స్వీటు.త్వరగా తయారయ్యే నోరూరించే ఈ స్వీటు ఎవరికి ఇష్టముండదు చెప్పండి?? ఇదే కాకుండా ఈ స్వీటు ఇప్పుడు ఎందుకు తయారు చేసుకోవాలో మేము ఒక కారణం చెప్తాము. ఎందుకంటే రాబోయేది నవరాత్రుల సమయం కాబట్టి.అందుకే ఈ స్వీటు తప్పక చెయ్యాలి మరి.
నవరాత్రులు త్వరలోనే వస్తున్నాయి కదా.తొమ్మిది రోజుల పాటు జరుపుకునే నవరాత్రుల్లో ఒక్కోరోజు ఒక్కో దుర్గా మాత అవతారాన్ని పూజిస్తూ ప్రతీరోజూ ఒక్కో రకం స్వీటు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.అలాంటి ప్రసాదాల్లో చూడగానే నోరూరించే జిలేబీ కూడా ఒకటి.మరింక ఆలశ్యమెందుకు, జిలేబీ తయారీ విధానమెలాగో క్రింద ఇచ్చిన వీడియో చూసి తెలుసుకోండి.
ఎంత మందికి సరిపోతుంది-5
జిలేబీ తయారీ సమయం-20 నిమిషాలు
సామాన్లు సిద్ధం చేసుకోవడం-30 నిమిషాలు
కావాల్సిన పదార్ధాలు:
1.రీఫైండ్ ఫ్లోర్(మైదా)-ఒక కప్పు
2.పెరుగు-అరకప్పు
3.ఆరెంజ్ ఫుడ్ కలర్-పావు టీ స్పూన్
4.పంచదార-ఒక కప్పు
5.నీళ్ళు-ఒక కప్పు
6.కుంకుమ పూవు రెకలు-5-6
7.గార్నిషింగ్-రబ్రీ స్వీట్ మరియూ పిస్తా పప్పులు.
తయారు చేసే విధానం:

1.ఒక పెద్ద గిన్నెలో మైదా(రిఫైండ్ ఫ్లోర్),పెరుగు,ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి తగినంత నీరు పోసి పల్చగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక వెచ్చటి స్థలంలో 8-9 గంటలపాటు ఉంచి పులియబెట్టాలి.

2.పంచదార,కుంకుమ పువ్వుని నీటిలో కలిపి సన్నని సెగ మీద పాకం వచ్చేవరకూ ఉంచాలి.తరువాత కొద్దిగా మంట పెంచి పాకాన్ని కాస్త దగ్గరకి రానివ్వాలి.

3.జిలేబీ వెయ్యడానికి సిద్ధం చేసుకున్న వస్త్రం మీద జిలేబీ పిండి వేసి నాలుగు పక్కలూ మడిచి పొట్లం లాగ చెయ్యాలి.

4.వేడి వేడి నెయ్యి లేదా నూనెలో చక్రాల్లాగా జిలేబీని వేసి మధ్య మధ్యలో కదుపుతూ గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి.

5.నూనెలో నుండి తీసి పంచదార పాకంలో వేసి 2-3 నిమిషాలుంచి తీసెయ్యాలి.పాకం నుండీ తీసిన జిలేబీలు ఒక పళ్ళెంలో తీసుకుని వాటి మీద రబ్రీ స్వీట్ కాస్త వేసి పిస్తా పప్పులతో అలంకరించుకోవాలి.




Click it and Unblock the Notifications











