Latest Updates
-
ఒక్క సంఘటన.. ఆ దంపతులను మళ్లీ కలిపింది.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో.! -
35 సంవత్సరాలు దాటిన వాళ్లు ఈ 8 ఫుడ్స్ తింటే స్టామినాకు తిరుగుండదు! -
పీరియడ్స్లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా?.. యోగాతో ఇక వాటి అవసరమే ఉండదు.! -
చాణక్యుడి సక్సెస్ మంత్ర..కష్టకాలంలో కూడా విజయం సాధించాలంటే ఇలా ఉండాలి..! -
చికెన్, మటన్ కూడా పనికిరావు.. ఈ గోంగూర గుడ్డు కర్రీ రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలంలో పాదాల పగుళ్లతో అవస్థలు.. ఇలా చేస్తే మృదువుగా మారిపోవాల్సిందే.! -
కూరలో ఉప్పు ఎక్కువైందా.? పెరుగు పుల్లగా అయిందా.. అయితే ఇలా సరిచేయండి.! -
నేడు ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. డబ్బు, కెరీర్ పరంగా భారీ లాభాలు! -
జూన్ 16 చంద్ర దర్శనం: ఈ రాశుల వారికి తిరుగులేని ధనయోగం.. అదృష్టం మీదే! -
అబ్బాయిలూ ముఖం జిడ్డుగా మారుతోందా.. మాన్సూన్లో ఈ స్కిన్ కేర్ టిప్స్ తప్పనిసరి.!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే అరటిపండు మాల్పువా.. ఈ సీక్రెట్ తో చేస్తే రుచి అద్భుతం!
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే మాల్పువా రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా బయట దొరికే మాల్పువాలను మావా (ఖోవా)తో చేస్తారు. కానీ, మనం మావా లేదా బేకింగ్ సోడా లాంటివి ఏమీ వాడకుండానే, కేవలం బాగా పండిన అరటిపండ్లను ఉపయోగించి అత్యంత మృదువైన, నోరూరించే మాల్పువాలను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పండిన అరటిపండు కలపడం వల్ల మాల్పువాలకు అద్భుతమైన మృదుత్వం వస్తుంది.

పిండిని కలుపుకునే విధానం
ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి (లేదా మైదా) వేయండి. దానికి అర కప్పు కంటే కొంచెం తక్కువగా బొంబాయి రవ్వ (సూజీ) కలపండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో బాగా పండిన ఒక అరటిపండును ముక్కలుగా కోసి వేయండి. దానికి ఒక కప్పు పాలను జతచేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ అరటిపండు-పాల మిశ్రమాన్ని రెడీ చేసుకున్న పిండిలో పోసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిక్కటి దోశ పిండి లాగా కలుపుకోవాలి.
పిండిని నానబెట్టడం, పాకం తయారీ
కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు పక్కన
పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బాగా నాని, పిండి ఉబ్బి మాల్పువాలు
అత్యంత మృదువుగా వస్తాయి. ఈలోపు పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. స్టవ్
మీద ఒక గిన్నె పెట్టి,అందులో ఒక గ్లాసు పంచదార, అర గ్లాసు నీళ్లు పోసి
వేడి చేయండి. పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించాలి. మంచి
సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి, కొన్ని కుంకుమపువ్వు రేకులను
కలపండి. పాకం మరీ చిక్కబడకూడదు. పాకం చల్లారాక గట్టిపడకుండా ఉండటానికి
అందులో ఒక చుక్క నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోండి.
మాల్పువాలను నూనెలో వేయించడం
అరగంట తర్వాత పిండిని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్
వెలిగించి ఒక చదునైన అడుగు ఉన్న ఫ్లాట్ పాన్ లేదా కడాయి పెట్టుకోండి.
అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నూనె
వేడెక్కిన తర్వాత, ఒక చిన్న గిన్నె లేదా గరిటెతో కొద్దిగా పిండిని
తీసుకుని నెమ్మదిగా నూనెలో పోయండి. పిండి దానంతట అదే గుండ్రంగా
వ్యాపించి మాల్పువా ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఒకవేళ పిండి
వ్యాపించకపోతే, పిండిలో మరికొన్ని నీళ్లు కలిపి కొద్దిగా పల్చగా
చేసుకోండి.
పాకంలో వేయడం మరియు వడ్డించడం
మాల్పువాలను లోపల పచ్చిగా లేకుండా ఉండటానికి మీడియం ఫ్లేమ్ మీ ద
మాత్రమే వేయించాలి. అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. ఆ
తర్వాత వాటిని బయటకు తీసి, అదనపు నూనెను గట్టిగా పిండేయండి. ఇలా
వేయించిన వేడి వేడి మాల్పువాలను వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్న
పంచదార పాకంలో వేసి ముంచాలి. కొద్దిసేపటి తర్వాత మాల్పువాలు పాకాన్ని
పీల్చుకున్నాక, వాటిని బయటకు తీసి వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications