Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
డ్రై చెన్నా మసాల వరలక్ష్మీ వ్రత స్పెషల్
శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు.
లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే! వరాలు ఇచ్చే తల్లి అంత సులువుగా కనికరిస్తుందా? ఆమెకు ప్రియమైనవి చేయాలి. నైవేద్యం పెట్టాలి. అమ్మా తల్లీ అనాలి. ఆమె ఓకే అన్నాక మనమూ ఒక స్పూను నోట్లో వేసుకోవాలి. వాహ్. ఏమి రుచి. శనగల చపాతీ... శనగల పాయసం... శనగల పులుసు...వాటే టేస్టు. అన్నట్టు శనగల పదార్థాలు హెల్తుకు కూడా మంచివట.
వాతానికి వాత అట. వంటికి చలువ అట. ఆకలి రేగునట. మరి ఈ ఛాన్స్ను మనం ఎందుకు వదులుకోవాలి?ఈ వరలక్ష్మీవ్రతం పర్వదినాన శనగలు తెండి. వండండి. వరాలు పొందండి.

కావలసిన పదార్థాలు:
- శనగలు : 150grm
- పచ్చిమిర్చి : 3
- పచ్చిమిర్చితరుగు :3tbsp
- ఉల్లిపాయ : 1
- ఉల్లితరుగు : 1/2cup
- ఉప్పు : తగినంత
- జీలకర్ర : 1tsp
- నూనె : సరిపడా
- కరివేపాకు : నాలుగు రెమ్మలు
- ఆవాలు : 1tsp
- శనగపప్పు : 1tsp
- మినప్పప్పు : 1tsp
- అల్లం ముక్క : చిన్నది
- అల్లం తురుము : 1tsp
- ఎండుమిర్చి : 6
తయారు చేయు విధానం:
1. ముందుగా శనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టాలి. నానిన శనగలను శుభ్రంగా కడిగి నీరు తీసేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. (మరీ మెత్తగా రుబ్బకూడదు). రుబ్బుతున్నప్పుడే అందులో జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వేయాలి.
2. తరవాత ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చితరుగు, అల్లంతురుము, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి.
3. వేగుతుండగానే ఉల్లి తరుగు వేసి కొద్దికొద్దిగా వేయిస్తూ, రుబ్బి ఉంచుకున్న ముద్దను వేసి అన్నీ బాగా కటిపి మూత పెట్టాలి. మంట బాగా తగ్గించాలి. మధ్యమధ్యలో కలుపుతూ కొద్దికొద్దిగా నూనె వేస్తూండాలి. (దీనికి నూనె ఎక్కువ అవసరం అవుతుంది). సుమారు అరగంట ఈ మిశ్రమం విడివిడిలాడినట్లుగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











