Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రుచికరమైన మసాలా పూరి: మాన్ సూన్ స్పెషల్
మసాలా పూరి ఈ వర్షాకాలంలో స్నాక్ గా లేదా మీల్ గా లేదా డిన్నర్ టైమ్ లో కూడా తీసుకోవచ్చు. వెరైటీగా తయారుచేసే ఈ మసాలా పూరిలు తయారుచేయడం చాలా సులభం. రెగ్యులర్ పూరిలు తిని బోరుకొడుతున్నప్పుడు ఇలాంటి కొత్త వంటలను ప్రయత్నివచ్చు.
రెగ్యులర్ పూరిల్లా కాకుండా, ఈ మసాలా పూరిల కొరకు పెరుగు మరియు కొన్ని మసాలా దినుసులను ఉపయోగిస్తారు. దాని వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది . పెరుగుజోడించడం వల్ల కొంచెం పుల్లదానికి మసాలాలు పట్టించడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్ గా కమ్మగా ఉంటుంది . వర్షాకాలంలో వీటి స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
గోధుమపిండి: 2cups
కారం: 1tbsp
గరం మసాలా పౌడర్: 1/2tbsp
జీలకర్ర: 1/4tsp
పెరుగు: 1cup
పచ్చిమిర్చి: 1-2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర కొద్దిగా
నూనె : డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పెరుగును ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులో కారం, గరం మాసాల, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి మరియు పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత ఈ మిశ్రమంలోనే గోధుమ పిండి కూడా వేసి, నీళ్ళు, ఉప్పు వేసి మొత్తం బాగా కలగలుపుకోవాలి.
4. ఇలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకొన్న పిండిని 15-20నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
5. 20నిముషాల తర్వాత మొత్తం పిండినుండి కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పూరీల్లా వత్తుకోవాలి.
6. అంతలోపు, పాన్ లో నూనె సోసి వేడి చేయాలి. వేడయ్యాక పూరిల్లా వత్తుకొన్న పూరిలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే మసాలా పూరీలు రెడీ. వీటికి ఎటువంటి చట్నీ లేదా సబ్జీ అవసరం ఉండదు. వీటని అలాగే ప్లెయిన్ గా రైతా లేదా పెరుగుతో తినవచ్చు. కమ్మగా రుచికరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications