Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
రుచికరమైన తేరి రిసిపి: ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్
ఉత్తర్ ప్రదేశ్ లో నార్మల్ గా చేసుకొనే ఒక వెరైటీ వంటను మనం ఇక్కడ కాస్త స్పెషల్ గా తయారుచేసుకోవచ్చు. పూర్వకాలంలో వంటలు కుండల్లో , పొయ్యి మీ వండేవారు. అందుకే ఆ వంటలు అంతరుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండేవి. అదే వంటల సాంప్రదాయంను ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కుండలో సువాసనభరిమతైన మసాలాలు మరియు వెజిటేబుల్స్ జోడించి తయారుచేసి ఈ వంటకు చాలా ప్రత్యేకత ఉంది.
READ MORE: ముల్లంగి సాంబార్ రిసిపి: సౌత్ ఇండియన్ స్పెషల్
కుండలో చేసి ఈ రైస్ రిసిపిని మద్యహ్నాన భోజనం, లేదా రాత్రి డిన్నర్ కు తీసుకోవచ్చు. ఈ రైస్ రిసిపికి వేరే ఏ ఇతర కర్రీలు అవసరం ఉండదు. సాధా పెరుగు ఒక్కటి చాలు. ఈ మసాలాను వివిధ రకాల వెజిటేబుల్స్ తో ఉడికించడం వల్ల ఆరోగ్యానికి పూర్తి పోషకాలను అందిచ్చవచ్చు. మరి ఈ స్పెషల్ రైస్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
వైట్ రైస్ - 2 cups
కాలీఫ్లవర్ - 100 gms
ఉల్లిపాయలు - 2
బంగాళదుంపలు - 3
పచ్చిబఠానీలు - ½ cup
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 tsp
నూనె- 3 tsp
నెయ్యి - 2 tsp
బిర్యానీ ఆకు - 2
దాల్చినచెక్క - 2 stick
యాలకలు - 2 pods
లవంగాలు- 4
పసుపు - ½ tsp
కారం - ½ tsp
ధనియాలపొడి-1tsp
గరం మసాలా - 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా
READ MORE: హెర్బ్ ఫ్రైడ్ రైస్ రిసిపి -బెటర్ హెల్త్
తయారుచేయు విధానం:
1. మొదటగా బియ్యంను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాట్/తేరి(కుండలో) నూనె వేసి, వేడి అయిన తర్వాత అందులో మసాలాలు, యాలకలు, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఆరోమా వాసన వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి
4. ఇప్పుడు అందులో మిర్చి,పసుపు, మరియు ధనియాలపొడి వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో పచ్చిబఠానీలు, ఉప్పు, వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి
6. తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న బియ్యంను కూడా వేసి, నిధానంగా మిక్స్ చేయాలి. దీన్ని 10నిముషాలు ఉడికించుకోవాలి.
8. పది నిముషాల తర్వాత బియ్యం పూర్తిగా ఉడుకుతున్న సమయంలో మంటను పూర్తిగా తగ్గించి రెండు మూడు నిముషాలు సిమ్ లో పెట్టుకోవాలి. అంతే రుచికరమైన తేరి రిసిపి రెడీ...



Click it and Unblock the Notifications











