Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వేడి వేడి వెజ్ సమోసా-పచ్చిమిర్చి కారం భలే రుచి

కావలసిన పదార్థాలు:
మైదా: 1 cup
నెయ్యి: 1/2 cup
బేకింగ్ పౌడర్: 1/4 tbsp
ఉప్పు: రుచికి తగినంత
నీళ్ళు
సమోసా కూర తయారికి:
కావలసిన పదార్థాలు:
బంగాలదుంపలు: 2( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిమి పెట్టుకోవాలి).
క్యారెట్ 2, బీన్స్: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాబేజ్ (సన్నగా తరిగినది): 1/2cup
ఉలిపాయాలు: 1 (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి బఠానీలు: 1 cup
పచ్చిమిరపకాయలు: 2
కొత్తిమిరీ తరుగు: 2tbsp
నిమ్మరసం: 2tbsp
పసుపు: 1/2tsp
గరం మసాల: 1/2 tbsp
కారం: 1 tbsp
ఆవాలు: 2 tbsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
నునె: వేయించడానికి సరిపడా
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేసే విధానం :
1. ముందుగా మైదాలో ఉప్పు, బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి. కలిపిన పిండిని అరగంట పాటు తడిబట్టలో చుట్టి వుంచాలి.
2. ఇంతలోపు సమోసాకు కూర సిద్దం చేసుకోవాలి. ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
3. పచ్చిమిర్చివేగిన తర్వాత ఇప్పుడు పచ్చిబఠానీలు, కూరగాయముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, కొత్తిమిర, కారం, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకొని నీళ్ళు ఇమిరిపోయిన తర్వాత అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
4. తర్వాత అందులో నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పెట్టుకున్న మైదాని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి. అంచులు గట్టిగ వత్తుకోవాలి.
6. ఇలా అన్నింటిని తయారు చేసుకొన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో సమోసాను కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే వెజ్ సమోసా రెడీ. సమొసానీ టొమటో సాస్ తో కానీ లేదా పచ్చిమిర్చి చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











