Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే!
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
హిందూ పంచాంగంలో పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమికి అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనినే వైశాఖ పౌర్ణమి అని, బుద్ధ పౌర్ణమి అని కూడా భక్తిశ్రద్ధలతో పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు తన పదహారు కళలతో సంపూర్ణ తేజస్సుతో ప్రకాశిస్తాడు.

ఆ వెన్నెల కిరణాలు నేరుగా మనిషి మనస్సుపై, భవిష్యత్తుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఎప్పటినుంచో తీరని సమస్యలతో సతమతమవుతున్నారా? లేదా మనసులో బలంగా నాటుకుపోయిన కోరిక ఏదైనా ఉందా? అయితే వైశాఖ పౌర్ణమి రాత్రి జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ అద్భుత పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి.
ఈ ఏడాది అంటే 2026 వైశాఖ పౌర్ణమి మే 1న జరుపుకుంటారు. పౌర్ణమి తిథి ఏప్రిల్ 30న రాత్రి 9: 12 గంటల సమయంలో ప్రారంభమై మే 1వ తేదీ రాత్రి 10:52 గంటల సమయంలో ముగుస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు తొలిగి, ధనప్రాప్తి కోసం
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పౌర్ణమి రాత్రిని మించిన పవిత్రమైన సమయం మరొకటి లేదు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు రాత్రి పూజా సమయంలో ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని తీసుకోండి. అందులో 11 గవ్వలను ఉంచి, వాటికి భక్తితో పసుపు, కుంకుమలతో తిలకం దిద్దండి. ఆ గవ్వల మూటను సాక్షాత్తూ సిరిసంపదల అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి పాదాల చెంత ఉంచి మనస్ఫూర్తిగా పూజించండి.
మరుసటి రోజు ఉదయం ఆ గవ్వల వస్త్రాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లోని బీరువాలో లేదా డబ్బులు దాచుకునే ప్రదేశంలో (సేఫ్ లో) భద్రంగా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
మానసిక ప్రశాంతత కోసం చంద్రుడికి అర్ఘ్యం
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు, తరచుగా మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి ఈ పౌర్ణమి ఒక వరం. వైశాఖ పౌర్ణమి రాత్రి నిండు చందమామకు అర్ఘ్యం సమర్పించాలి. ఒక పాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు తీసుకుని, అందులో కొద్దిగా పచ్చి పాలు, విరగని బియ్యపు గింజలు (అక్షతలు) వేసి చంద్రునికి జల సమర్పణ చేయాలి.
ఈ అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఈ పరిహారం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడమే కాకుండా, మీలో ఆకర్షణ శక్తి రెట్టింపు అవుతుంది.

పితృదోషాల నివారణకు రావి చెట్టు పూజ
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానమాచరించి రావి చెట్టు మొదట్లో (వేళ్లకు) స్వచ్ఛమైన నీటిని సమర్పించాలి. ఆ తర్వాత సాయంత్రం వేళ అదే రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న పితృ దోషాలు శాంతిస్తాయి. ఇంట్లో ఉండే కుటుంబ కలహాలు, మనస్పర్థలు తొలగిపోయి ఆనందం వెల్లివిరుస్తుంది.
ఇంటికి రక్షాకవచంగా తులసి పూజ
హిందువుల ప్రతి ఇంటా కొలువై ఉండే సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం తులసమ్మ. వైశాఖ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోట ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం భక్తిశ్రద్ధలతో తులసి మాత చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తూ నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. తులసి మాత ఆశీస్సులతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెంది, కుటుంబమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది.
Diclaimer: మతవిశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు. దీనిని నమ్మడం వ్యక్తిగత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications