Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
మోర్ కుజంబు(మజ్జిగ పులుసు): ఉగాది స్పెషల్
ఈ రోజు మీకోసం ఒక ఉగాది స్పెషల్ వంటకంను అందిస్తున్నాం. దీన్ని మోర్ కుజంబు అని పిలుస్తారు. పెరుగుతో తయారుచేసే ఈ వంటను సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ రిసిపిగా పిలుస్తారు.
మోర్ అంటే మజ్జిగ కుజంబు అంటే పులుసు. ఈ మజ్జిగ పులుసును మజ్జిగతో తయారుచేస్తారు మరియు దీన్ని తయారుచేయడానికి కొన్ని పోపుదినుసులు మరియు మసాలా దినుసులు కూడా ఉపయోగిస్తారు. ఈ వంట తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టడు. మరియు ఇది ఆరోగ్యానికి చాలా మేలు మరియు చలువ చేస్తుంది. పొట్టను చల్లగా ఉంచుతుంది. పుల్లని రుచి ఫ్లేవర్ కలిగిన ఈ మజ్జిగ పులుసును ఎలా తయారుచేయాలో చూద్దాం...

పెరుగు: 1cup
తెల్లగుమ్మడికాయ: 1cup(చిన్న ముక్కలుగా తరిగినవి)
కొబ్బరి తురుము: ½cup
జీలకర్ర: ½tsp
పచ్చిమిర్చి: 2(మద్యలోకి కట్ చేయాలి)
మెంతులు:¼ tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: ½tsp
నీళ్ళు: ½ cup
పోపుకోసం:
ఆవాలు: ¼ tsp
జీలకర్ర ¼ tsp
కరివేపాకు 6-7
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగినవి)
ఆయిల్: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, మరియు జీలకర్రను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని స్పూన్ తో బాగా కలియబెట్టాలి.
3. తర్వాత చిలికి పెట్టుకొన్న పెరుగులో మెంతులు, నీళ్ళు, కొబ్బరి తురుము పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి వేడి చేయాలి. తర్వాత అందులో పెరుగు మిశ్రమాన్ని పోయాలి.
5. తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి తక్కువ మంట మీద 5-6నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి
తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న పెరుగు కర్రీని అందులో పోయాలి.
8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మోర్ కుజంబు రెడీ. అన్నంతో ఈ స్పెషల్ రిసిపిని సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications