ఆకుకూరల ప్రియులకు తోటకూర పప్పు

Thotakura Pappu
శాఖాహారంలో ఆకుకూరల్లో తోటకూర ప్రధానమైనదని చెప్పవచ్చు. తోటకూర ఆకుకూరల ప్రియులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి వాటితో ఎన్నిరకాలు వండుకోవచ్చు అంటే పప్పు, పులుసు, వేపుడు. సంవత్సరం పొడవునా దొరికే తోటకూర, వెల్లుల్లితో కలిపి వేపుడు చేస్తే చాలా బావుంటుంది. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి లివర్ సంబంధిత రోగులు కూడా దీనిని వాడుకోవచ్చు. రక్తమొలలతో బాధపడేవారు తోటకూరను పెరుగు పచ్చడిగా చేసుకొని తింటే ఉపశమనం కలుగుతుంది

కావలసిన పదార్థాలు:
తోటకూర: 4కట్టలు
కందిపప్పు: 1cup
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1tsp
పచ్చిమిరపకాయలు: 8-10
కారం: తగినంత
వెల్లుల్లిపాయలు: 4-6రెబ్బలు
ఉల్లిపాయ: 1
టమాట: 2-4
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: తగినంత
ధనియాలపొడి, జీలకపూరపొడి: 1tsp
నెయ్యి: 1tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. పప్పులో కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి.
2. తర్వాత పాన్ లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. వెల్లుల్లి పాయలను చిదిమి అందులో వేయాలి. ఉల్లిపాయ కూడా వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేపాలి.
3. ఇప్పుడు టమాటముక్కలను, తోటకూర వేసి కలపాలి. ఇప్పుడు కాస్త అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా, జీలకపూరపొడులను వేయాలి. పదిహేను నిమిషాల పాటు వేయించి బాగా కలపాలి.
4. ఆ తర్వాత పప్పు, కొన్ని నీళ్లు పోయాలి. ఇలా ఓ అరగంట తర్వాత నెయ్యి వేసి దించిస్తే వేడి.. వేడి తోటకూర పప్పు మీ నోరూరిస్తుంది.

Story first published: Friday, March 9, 2012, 17:04 [IST]
Desktop Bottom Promotion