పర్యావరణ ప్రేమి మానెకా గాంధీ!

By B N Sharma

Maneka Gandhi
మానెకా గాంధీ ఒక సిక్కు కుటుంబంలో లెఫ్టినెంట్ కల్నల్ త్రిలోచన్ సింగ్ ఆనంద్ మరియు అమరదీప్ కౌర్ లకు ఢిల్లీలో 26 ఆగస్ట్, 1956వ తేదీన జన్మించింది. 17 సంవత్సరాల వయసుకే సంజయ్ గాంధీతో ఆమెకు వివాహమైంది. వీరిరువురూ ఇందిరా గాంధీ తో కలిసి యూత్ కాంగ్రెస్ తరపున రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.

1977 లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పొందినపుడు ఆమె వ్యవస్ధాపక ఎడిటర్ గా సూర్య అనే రాజకీయ మాసవారీ వార్తా పత్రిక నడిపింది. తన పత్రికలో భర్త సంజయ్ గాంధీ, అత్తమ్మ ఇందిరా గాంధీల రాజకీయప్రయోజనాలకు తీవ్ర కృషి చేసింది. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె కోర్టులలో సైతం వ్యక్తిగత హక్కులకు పోరాడింది. ఈమె సహాయ సహకారాలతో సంజయ్ గాంధీ కాంగ్రెస్ ను సుమారు మూడు సంవత్సరాల కాలంలో మరోమారు అధికారానికి తెచ్చాడు. వీరికి కలిగిన బిడ్డకు ఫిరోజ్ అని నామకరణం చేశారు. ఇందిరా గాంధీ ఆ పేరుకు వరుణ్ అనే పేరు కలిపింది. మానెకకు 23 వ ఏట ఆమె కుమారుడుకు 100 రోజుల వయసు వున్నపుడే సంజయ్ గాంధీ ఒక విమాన దుర్ఘటనలో మరణించాడు.

మానెకా గాంధీ పర్యావరణ ప్రేమి. జంతువుల హక్కులగురించి పోరాడేది. 1995 వ సంవత్సరంలో ఆమె యానిమల్స్ ఎక్స్ పెరిమెంట్స్, సూపర్ విజన్ అండ్ కంట్రోల్ అనే కమిటీకి ఛైర్ వుమన్ గా నియామకం పొందింది. పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్ధను ఆమె 1992 లో నెలకొల్పింది. భారత దేశంలోని జంతువుల హక్కులు సంక్షేమం కొరకు ఈ సంస్ద చట్టపరంగా అనేక పోరాటాలు సాగించింది. మానెకా జంతువుల సంబంధంగా టెలివిజన్ ఛానెల్ లో కొన్ని కార్యక్రమాలను సైతం నిర్వహించి దేశంలోని ప్రజలకు జంతువుల రక్షణ సమాచారం పట్ల ఆసక్తి కల్పించింది. ఆమె శాఖాహారి. శాఖాహార జీవన విధానాలను బలపరచింది. జంతువుల రక్షణపై ఆమె కొన్ని రచనలు చేసింది.

ఆమె ఒక జర్నలిస్టుగా ఎన్నో సాహస కార్యాలకు ఒడిగట్టింది. అప్పటి ప్రభుత్వ అరాచకాలను తన పత్రిక ద్వారా బయటపెట్టింది. 1983 లో రాష్ట్రీయ సంజయ్ మంచ్ అనే రాజకీయ పార్టీని పెట్టి యువకుల సాధికారత, ఉద్యోగాలకు పాటుపడింది. 1984 లో ఎన్నికల ప్రచారం పూర్తి స్ధాయిలో వుండగా తన అత్తమ్మ ఇందిరాగాంధీ స్వంత బాడీ గార్డుల దురాగతాలకు బలైపోవడంతో ఆ సంఘటనను తీవ్రంగా ఖండించింది.

తదనంతర పరిస్ధితులలో ఎన్నికలలో ఓటమి పాలైన ఆమె తన రాష్ట్రీయ సంజయ్ మంచ్ పార్టీని ప్రతిపక్ష పార్టీ జనత దళ్ లో కలిపేసి దానికి జనరల్ సెక్రటరీగా పదవి చేపట్టింది. పార్టీ సార్వత్రిక ఎన్నికలలో విజయం పొందటంతో మానెకా గాంధీ అతి చిన్న వయసులోనే మంత్రిగా అధికారాన్ని చేపట్టింది.

ఆమె వరుసగా పాలనకు వచ్చిన రెండు ప్రభుత్వాలలో పర్యావరణ మరియు అడవుల మంత్రిగా పదవి నిర్వహించింది. ఈ శాఖకు సంబంధించి అనేక చారిత్రాత్మక మార్పులు చేర్పులు చట్టపరంగా చేసింది. 2004 సంవత్సరంలో 14వ లోక్ సభకు (5వ పదవీకాలం) మెంబర్, కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖకు నియామకం చేయబడింది. 2009 లో అనోలా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యురాలుగా పదవి చేపట్టింది.

Story first published: Monday, March 5, 2012, 16:06 [IST]
Desktop Bottom Promotion