Latest Updates
-
వంకాయ-బంగాళదుంప గుజ్జు..ఇడ్లీ,దోశలకు సరైన జోడి! -
డైట్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు తినాల్సిన 4 సూపర్ స్నాక్స్ ఇవే! -
అచ్చమైన పల్లెటూరి స్టైల్ పచ్చి మామిడికాయ చట్నీ..చపాతీ, రోటీ, అన్నం దేనిలోకైనా అదుర్స్! -
Today Rasi Phalalu (23.03.26): వృషభ రాశిలో చంద్రుడి సంచారం.. ఆ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
శ్రీరామనవమి 2026 తేదీ, పూజా ముహూర్తం,శక్తివంతమైన శ్రీరామ మంత్రాలు -
ప్రేమలో మంకీ బ్రాంచింగ్.. డేటింగ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సరికొత్త ద్రోహం గురించి మీకు తెలుసా? -
సాయంత్రం టీ టైమ్లో కరకరలాడే శనగపిండి కారప్పూస.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
సాయంత్రం స్నాక్ గా కరకరలాడే చికెన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
డయాబెటిస్ ఉందా? అయితే మీరు రోజూ ఎంతసేపు నడవాలో తెలుసా? -
ఘుమఘుమలాడే మంగళూరు చికెన్ సుక్కా.. ఒక్కసారి వండితే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ కావాలంటారు!
భారత్ లో పెరుగుతున్న రెండో పెళ్లి ధోరణి..జీవన్ సాథి సర్వేలో ఆసక్తికర నిజాలు
నీ తారలు, ప్రముఖుల రెండో పెళ్లిళ్ల వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించడం మనకు అలవాటే. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. సగటు భారతీయుల ఆలోచనా విధానంలో కూడా ఊహించని మార్పులొచ్చాయి. ఒకప్పుడు పెళ్లి అనగానే జాతకాలు, 36 గుణాలు కలిశాయా లేదా అని ఆరా తీసేవారు.
కానీ ఇప్పుడు ఆ పట్టింపులు పోయాయి. కేవలం ఒకటి లేదా రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటే చాలనుకుంటున్నారు. ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ జీవన్ సాథి విడుదల చేసిన మోడరన్ మ్యాచ్ మేకింగ్ రిపోర్ట్ 2026.. భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను కళ్లకు కట్టింది. ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటో చూద్దాం.

వయసు కాదు.. కెరీర్ ముఖ్యం!
ఒకప్పుడు పాతికేళ్లు రాగానే ఇంట్లో పెళ్లి గోల మొదలయ్యేది. కానీ ఇప్పుడు యువత ఆలోచన పూర్తిగా మారింది. 2016లో సగటు వివాహ వయసు 27 ఏళ్లుగా ఉంటే, 2025 నాటికి అది 29 ఏళ్లకు పెరుగుతుందని సర్వే అంచనా వేసింది. బంధువుల ఒత్తిడికి లేదా సామాజిక భయాలకు తలొగ్గి పెళ్లి చేసుకోవడానికి యువత ఇష్టపడట్లేదు.
ముందుగా కెరీర్ లో స్థిరపడటం, ఆర్థిక స్వాతంత్ర్యం, తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికే పెద్దపీట వేస్తున్నారు. అందుకే సగం మందికి పైగా 29 ఏళ్లు వచ్చాకే భాగస్వామి వేట మొదలుపెడుతున్నారు.
పెరుగుతున్న రెండో పెళ్లిళ్లు
ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన దేశంలో రెండో పెళ్లిళ్ల ట్రెండ్ ఏకంగా 43 శాతం పెరిగింది. 2016లో 11 శాతంగా ఉన్న ఈ ఆసక్తి 2025 నాటికి 16 శాతానికి చేరుకుందని అంచనా. విడాకులు, రెండో పెళ్లి అనేవి ఒకప్పుడు సమాజంలో పెద్ద మచ్చగా భావించేవారు.
కానీ ఇప్పుడు ఆ సామాజిక ముద్ర చెరిగిపోతోంది. గతం గడిచిపోయిందని, సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎవరైనా అర్హులేనని ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఆరు మ్యాట్రిమోనీ సక్సెస్ స్టోరీల్లో ఒకటి రెండో పెళ్లికి సంబంధించినదే కావడం విశేషం.
కులం గోడలు బద్దలవుతున్నాయ్!
పెళ్లిళ్లలో కులం అనేది ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద అడ్డంకి. కానీ, ఆధునిక యువత ఈ గోడలను దాటేస్తోంది. 2016లో 91 శాతం మంది తమ కులంలోనే పెళ్లి జరగాలని పట్టుబడితే, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 54 శాతానికి పడిపోయింది.
మహానగరాల్లో అయితే ఇది 49 శాతానికే పరిమితమైంది. కులం, గోత్రాల కంటే కూడా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంటే చాలని ఇప్పటి యువత గట్టిగా నమ్ముతోంది.

ఢిల్లీ వైపు యువత చూపు
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. లక్నో, జైపూర్, భోపాల్ వంటి రాజధాని నగరాల యువత తమ భాగస్వాములను సొంత ఊర్లో కాకుండా ఢిల్లీలో వెతుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ వాసుల ఆధునిక ఆలోచనా విధానం, ఉదార స్వభావం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
భార్య ఎక్కువ సంపాదించినా ఓకే!
మగవాడే సంపాదించాలి, ఆడది ఇంటికే పరిమితం కావాలి అనే పాత కాలపు ఆలోచనలు కనుమరుగవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా సంపాదించాలని 42 శాతం మంది కోరుకుంటున్నారు.
అసలు ట్విస్ట్ ఏమిటంటే.. తమ కంటే తమ భార్య ఎక్కువ సంపాదించినా ఏమాత్రం ఈగో ఫీల్ అవ్వమని, సంతోషంగా అంగీకరిస్తామని ఏకంగా 87 శాతం మంది పురుషులు చెప్పడం ఆధునిక భారతీయ మగవాడి ఆలోచనలో వచ్చిన గొప్ప మార్పు.



Click it and Unblock the Notifications











