Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.! -
నెలసరి సమయంలో చేసే పొరపాట్లు.. శానిటరీ ప్యాడ్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారా.? -
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు? -
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు -
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి!
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ..బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా ఇవాళ(ఏప్రిల్ 30) అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. లక్ష్మీదేవి,విష్ణువుని ఈ రోజు పూజించడం వల్ల సిరిసంపదలు, అదృష్టం లభిస్తాయని హిందువులు నమ్ముతారు. ఇవాళ అక్షయ తృతీయ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజునే.. గంగానది భూమ్మీదకు వచ్చింది,త్రేతాయుగం ప్రారంభమైంది,శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడు,బ్రహ్మ శివుడు ఆశిస్సులతో స్వర్గపు సంపదకు కుబేరుడు అధిపతి అయ్యాడు. ఈ పవిత్రమైన రోజున గృహ ప్రవేశం, పెళ్లి, బంగారం కొనడం, కొత్తగా ఏదైనా ప్రారంభించడం వంటివి శుభప్రదం అని చెబుతుంటారు.
అక్షయ తృతీయ శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 29,2025 సాయంత్రం 5: 31 గంటలకు ప్రారంభహై..ఏప్రిల్ 30 మధ్యాహ్నాం 2:12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 30న అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఏప్రిల్ 30న ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు పూజకు చాలా శుభప్రదమైనదిగా సమయంగా పరిగణించబడుతుంది.

బంగారం కొనడానికి శుభ సమయం
ఏప్రిల్ 29 సాయంత్రం 05:31 నుండి ఏప్రిల్ 30 ఉదయం 05:41 వరకు.
ఏప్రిల్ 30 ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు.
సాయంత్రం ముహూర్తం: రాత్రి 08:16 నుండి రాత్రి 09:37 వరకు
రాత్రి ముహూర్తం: ఏప్రిల్ 30 రాత్రి 10:57 నుండి తెల్లవారుజాము 03:00 వరకు.
బంగారం కొనలేకుంటే ఇది కొనండి
ప్రస్తుతం బంగారం ధరలు కొండెక్కి కూర్చోడంతో బంగారం కొనడం అటుంచి గోల్డ్ పేరు వింటేనే సామాన్యులు వణికిపోతున్నారు. ఈ పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయలేని వాళ్లు లక్ష్మిదేవికి చిహ్నంగా భావించే వెండిని కొనడం శుభప్రదం. వెండి నాణేలు, వెండి ఆభరణాలు,వెండి పాత్రలు కొనడం శుభప్రదం. అయితే వెండి ధరలు కూడా పెరిగిన క్రమంలో దీనిని కొనుగోలు చేయడం కూడా కష్టంగా భావించే పేదవారు లేదా విలువైన లోహాలు కొనుగోలు చేయలేనివాళ్లు మట్టి కుండలు కొనుగోలు చేయడం శుభప్రదం అని పండితులు సూచించారు.



Click it and Unblock the Notifications