Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ..బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే..!

దేశవ్యాప్తంగా ఇవాళ(ఏప్రిల్ 30) అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. లక్ష్మీదేవి,విష్ణువుని ఈ రోజు పూజించడం వల్ల సిరిసంపదలు, అదృష్టం లభిస్తాయని హిందువులు నమ్ముతారు. ఇవాళ అక్షయ తృతీయ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజునే.. గంగానది భూమ్మీదకు వచ్చింది,త్రేతాయుగం ప్రారంభమైంది,శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడు,బ్రహ్మ శివుడు ఆశిస్సులతో స్వర్గపు సంపదకు కుబేరుడు అధిపతి అయ్యాడు. ఈ పవిత్రమైన రోజున గృహ ప్రవేశం, పెళ్లి, బంగారం కొనడం, కొత్తగా ఏదైనా ప్రారంభించడం వంటివి శుభప్రదం అని చెబుతుంటారు.

అక్షయ తృతీయ శుభ సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 29,2025 సాయంత్రం 5: 31 గంటలకు ప్రారంభహై..ఏప్రిల్ 30 మధ్యాహ్నాం 2:12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 30న అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఏప్రిల్ 30న ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు పూజకు చాలా శుభప్రదమైనదిగా సమయంగా పరిగణించబడుతుంది.

Akshaya Tritiya 2025 Importance and Puja Timings and Gold Purchase Time

బంగారం కొనడానికి శుభ సమయం

ఏప్రిల్ 29 సాయంత్రం 05:31 నుండి ఏప్రిల్ 30 ఉదయం 05:41 వరకు.

ఏప్రిల్ 30 ఉదయం 05:41 నుండి మధ్యాహ్నం 12:18 వరకు.

సాయంత్రం ముహూర్తం: రాత్రి 08:16 నుండి రాత్రి 09:37 వరకు

రాత్రి ముహూర్తం: ఏప్రిల్ 30 రాత్రి 10:57 నుండి తెల్లవారుజాము 03:00 వరకు.

బంగారం కొనలేకుంటే ఇది కొనండి
ప్రస్తుతం బంగారం ధరలు కొండెక్కి కూర్చోడంతో బంగారం కొనడం అటుంచి గోల్డ్ పేరు వింటేనే సామాన్యులు వణికిపోతున్నారు. ఈ పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయలేని వాళ్లు లక్ష్మిదేవికి చిహ్నంగా భావించే వెండిని కొనడం శుభప్రదం. వెండి నాణేలు, వెండి ఆభరణాలు,వెండి పాత్రలు కొనడం శుభప్రదం. అయితే వెండి ధరలు కూడా పెరిగిన క్రమంలో దీనిని కొనుగోలు చేయడం కూడా కష్టంగా భావించే పేదవారు లేదా విలువైన లోహాలు కొనుగోలు చేయలేనివాళ్లు మట్టి కుండలు కొనుగోలు చేయడం శుభప్రదం అని పండితులు సూచించారు.

Desktop Bottom Promotion