Latest Updates
-
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.!
చనిపోయిన వారి వస్తువులు ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా..?
హిందూ శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి వస్తువుల్లో కొన్నింటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ొక వేల ఉపయోగిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. శాస్త్రాలు వీటి గురించి చాలా కఠినంగా హెచ్చరించాలి. గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడనకు ఎన్నో విషయాలు చెబుతాడు. వాటిని చనిపోయిన వ్యక్తుల సంబంధించిన కూడా చాాలా విషయాలు చెబుతారు. పుట్టిన మనిషి తప్పకుడా చనిపోవాలని, చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మించడం కూడా కచ్ఛితంగా జరుగుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మృత్యువు నుంచి ఎవరూ లప్పించుకోలేరు.

చావు వచ్చినప్పుడు, మనుషులు శరీరాన్ని త్యాగం చేయాల్సి వుంటుంది. శరీరంతో పాటు ఆ వ్యక్తి ఉపయోగించిన వస్తువులను కూడా త్యాగం చేయాల్సిందే. చనిపోయిన తరువాత మనిషి ఈ భూమిపైనుంచి ఏ వస్తువులను పైకి తన వెంట తీసుకొని వెళ్లలేడు. కేవలం తాను చేసిన పాప పుణ్యాలు మాత్రమే తన వెంట తీసుకొని వెళ్తాడు. జీవితంలో ఎవరైనా పాపాలకంటే పుణ్యాలు ఎక్కువగా చేసి వుంటే అతనికి మృత్యువు సమయంలో ఏ కష్టాలూ వుండవు. అప్పుడు అతని ప్రాణం చాలా సులభంగా ఏ కష్టాలూ లేకుండా పోతుంది.
ఎవరైతే జీవితంలో పుణ్యాలకంటే పాపాలు ఎక్కువగా చేస్తారో వారి చావు కూడా అంతే భయానకంగా వుంటుంది. అలాంటి వారు మృత్యు సమయంలో చాలా బాధను అనుభవించాల్సి వుంటుంది. యమదూతలు అతని పై చాలా దయనియంగా ప్రవర్తిస్తారు. యమపాశంలో ఆత్మను బంధించి యమలోకానికి తీసుకొని వెళ్తారు. యమలోకానికి వెళ్తున్న సమయంలో వారు చాలా బాధను అనుభవించాల్సి వుంటుంది. ఇవన్నీ జరిగినా కూడా యమదూతలకు ఆ పాపిపైన ఎలాంటి జాలి కూడా వుండదు. వాళ్లు ఆ పాపిని ఇంకా బాగా హింసిస్తారు.

హిందూ శాస్త్రం ప్రకారం సంసారంలో ఆత్మకి స్థానం వుండదు. ఆత్మ ఎప్పుడూ చావదు. అది చేసిన కర్మలను బట్టి ఆత్మ మళ్లీ మళ్లీ రూపం దాల్చుకుంటుంది. ఆత్మ శరీరంతో జన్మించిన తరువాత ఈ భూలోకంలో ఎన్నో భౌతిక సుఖాలకు అలవాటు పడుతుంది. చనిపోయిన తరువాత కూడా ఇష్టాన్ని ఆత్మ ఎప్పటికీ మరిచిపోదు. హిందూ శాస్త్రం ప్రకారం మనిషి భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా సంసారంలో వుంటాడో అప్పటి వరకు వేరు వేరు యోనిల ద్వారా జన్మిస్తూనే వుంటాడు.
యోహం ఎక్కువగా వుంటే చనిపోయిన తరువాత కూడా ఈ భూలోకంలోనే తిరుగుతూ వుంటాడు. బలవన్మరణం, లేదంటే ప్రమాదాల్లో చనిపోయినవారు ప్రేతాత్మలై ఇక్కడే తిరుగుతుంటారు.
గరుడపురాణం ప్రకారం చనిపోయిన వారి కొన్ని వస్తువులను ఎట్టిపరిస్థితిలో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి వుంటుంది. మోహం ఎక్కువగా వుంటే గనుక చనిపోయిన తరువాత కూడా ఆ వస్తువుల్లోనే ఆ వ్యక్తి వుంటాడు. ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగిస్తారో వారు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల చనిపోయిన వారి వస్తువులను ఎట్టి పరిస్థితిలో వాడకూడదు.కావాలంటే ఆ వస్తువులను ఘ్నాపకార్ధం ఇంట్లో భద్రపరుచుకోవచ్చు. లేదా ఆ వస్తువులను గంగానదిలో కలిపివేయాలి. కానీ తెలియకుండా కూడా ఆ వస్తువులను అస్సలు వాడకూడదు.
చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలంటే ఆ వస్తువలను బయట ఎవ్వరికైనా దానం చేయాలి. ఇలా చేయకూడదని గరుడపురాణంలో శ్రీమహావిష్ణువు హెచ్చరించాడు. అవి గనుక ఉపయోగించడం మొదలుపెడితే వాటిపైన మోహంతో వారి ఆత్మ ఈ భూమిపైన తిరుగుతూనే వుంటుంది. ఇక ఆ ఆత్మకి ఎప్పుడూ మోక్షం లభించదు. దీంతో ఆత్మకు వేరే శరీరం కూడా ప్రాప్తించదు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications