Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
Tirumala: తిరుమల వెళ్లే వారికి భారీ శుభవార్త..స్వామి దర్శనం టైంలో బిగ్ ఛేంజ్!
కోట్లాదిమంది భక్తులకు తిరుమల(Tirumala) అంటే కేవలం పుణ్యక్షేత్ర ప్రదేశమే కాదు ఓ ఎమోషన్ కూడా. హిందువులు,ముస్లింలు, క్రిస్టియన్లు ఇలా మతాలకు అతీతంగా భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఆ ఏడుకొండలవాడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోట్లాదిమంది పరితపిస్తుంటారు. అయితే తిరుమల వెళ్లిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే గంటలపాటు నిరీక్షణ తప్పదు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో దర్శనానికి 30 గంటలు పైగా సయయం పడుతుంది. దీంతో చాలామంది భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తిరుమల వెళ్లేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుడ్ న్యూస్ చెప్పింది . ఇకపై స్వామి వారి దర్శనానికి గంటలసేపు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త దర్శన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. సామి దర్శనం కోరుకునే భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి నిరంతరం అనేక సంస్కరణలు చేపడుతున్న టీటీడీ..ఇందులో భాగంగా వలం గంట సమయంలోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఏర్పాట్లును చేస్తోంది.

భక్తులు ఒక్క గంటలో శ్రావారి దర్శనం చేసుకునేలా ఏఐ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు బీఆర్ నాయుడు అన్నారు. ఇందుకోసం తిరుపతి దేవస్థానం బెంగళూరులోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం తిరుమలలో దర్శనానికి వచ్చే భక్తుల ముఖాలను అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా స్కాన్ చేసి దర్శనానికి సమయం కేటాయిస్తారు. ఇందుకోసం తిరుపతి విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, అలిబ్రి సహా 20 ముఖ్యమైన ప్రదేశాల్లో ఫేస్ స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు.
తిరుపతికి వచ్చే భక్తులకు ఈ టెక్నాలజీతో ముఖాన్ని స్కాన్ చేసి వారికి దర్శన సమయం కల్పిస్తారు. ప్రత్యేక దర్శనానికి గంట ముందుగా ఆలయానికి వస్తే మరో గంటలోపు దర్శనం చేసుకోవచ్చని నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దర్శనం కోసం దళారులకు డబ్బులు చెల్లించి భక్తులు మోసపోకుండా ఉండేందుకు, వారికి గౌరవప్రదమైన అనుభూతిని కలిగించేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డెమోలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 6 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.



Click it and Unblock the Notifications