Latest Updates
-
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం?
హనుమంతుడు రామభక్తుడని తెలుసు..రాముడితోనే యుద్ధం చేశాడని తెలుసా ?
బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆపాయ్యత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం జై హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు పుట్టినరోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం.
రామాయణం, మహాభారతంలోనే కాకుండా హనుమంతుడు వివిధ కథల్లో ప్రస్తావించారు. ఈ కథల ఆధారంగా హనుమంతుడు అంటే.. చాలా సాహసోపతమైన దైవంగా మనకు అర్థమవుతుంది. అయితే హనుమంతుడి, బలం, ధైర్య సాహసాలు, అమితమైన భక్తి మాత్రమే కాదు.. ఆంజనేయస్వామి గురించి మీకు తెలియని, మీరు గతంలో ఎప్పుడు వినని ఆసక్తికర విషయాలు మీకు పరిచయం చేయబోతున్నాం..

రాముడిపై హనుమంతుడి విజయం
యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు.

హనుమంతుడి ఆకలి
సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు తానకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే కోరిక ఉందని చెప్పాడు. అప్పుడు సీతాదేవి రకరకాల వంటకాలను వండి హనుమంతుడికి వడ్డించింది. కానీ.. హనుమంతుడికి ఆకలి మాత్రం తగ్గలేదు.. ఆశ్రమంలో ఉన్న సరుకులన్నీ అయిపోవచ్చాయి. అప్పుడు సీతాదేవి రాముడిని ప్రార్థించగా.. రాముడు తులసీదళం వడ్డించడం వల్ల.. హనుమంతుడి ఆకలి తగ్గుతుందని చెప్పగా.. హనుమంతుడి ఆకలి తీరింది.

పంచముఖి ఆంజనేయుడు
హనుమంతుడి వివిధ రూపాల్లో.. పంచముఖిగా దర్శనమిస్తాడు. రావనాసురుడి సోదరుడైన అహిరావన్ ను రాముడు, లక్ష్మణుడు అపహరిస్తారు. అహిరావన్ ని సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది 5 దీపాలు, 5 మార్గాల్లో తీసుకెళ్లాలి. అప్పుడు హనుమంతుడు తన రూపంతో పాటు, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవుడిగా 5 మార్గాల్లో వెళ్లాడు.

రాముడి మరణం
రాముడు చనిపోవడానికి హనుమంతుడు అంగీకరించలేదు. అయోధ్యలోకి యముడు ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. దీంతో హనుమంతుడిని మళ్లించాలని భావించిన రాముడు తన చేతి ఉంగరాన్ని కిందకు పడేస్తాడు. దాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశిస్తాడు రాముడు. ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడికి సర్పాలదీవికి చేరుకున్నాడు. ఇలా రాముడు తన బంటుని పక్కకు పంపి.. తన ప్రాణాలు కోల్పోయాడు.

దేవుళ్ల అనుగ్రహం
హనుమంతుడిని యుద్ధంలో ఏ ఆయుధంతోనూ ఎవరూ చంపలేని వరం బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. అలాగే దీర్ఘాయుష్సు, ఆధ్మాత్మిక చింతన, సముద్రం దాటే ధైర్యాన్ని శివుడు ప్రసాదించాడు.

పంచభూతాలు
ఆంజనేయస్వామికి పంచభూతాల అనుగ్రహం కూడా ఉంది. వరుణుడు నీటితో రక్షిస్తానని, అగ్ని దేవుడు ఎప్పటికీ.. అగ్నికి ఆహుతికావని, సూర్యడు అతిపెద్ద, అతి చిన్న రూపాల్లో మారే శక్తిని, వాయు దేవుడు ఎక్కువ వేగంతో వెళ్లగలిగే శక్తిసామర్థ్యాలను, యముడు ఆరోగ్యవంతమైన జీవితం, అలాగే తన యమపాశం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే తన ద్వారా హనుమాన్ కి మరణం ఉండదని అనుగ్రహిస్తాడు.

భీముడితో సంబంధం
భీముడి సోదరుడిగా హనుమంతుడిని చెబుతారు. వీళ్లద్దరికి తండ్రి ఒక్కరే వాయు దేవుడు.

కురుక్షేత్ర యుద్ధంలో
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో తనతో పాటు హనుమంతుడు ఉన్నాడని.. అర్జునుడు చెబుతాడు. చివరికి తాను తీసుకొచ్చిన జెండాలో హనుమంతుడు ఉన్నాడని వివరిస్తాడు. యుద్ధం తర్వాత హనుమంతుడు తన నిజరూపంలోకి వస్తాడు. హనుమంతుడు కిందకు దిగగానే అర్జునుడి వాహనం కాలిపోతుంది. అంటే.. ఎప్పుడో కాలిపోవాల్సిన వాహనాన్ని హనుమంతుడే రక్షించాడని.. కృష్ణుడు వివరిస్తాడు.

హనుమంతుడి అవతారాలు
హనుమంతుడిని రకరకాల రూపాలు, అవతారాల్లో చూసినట్టు.. మతగురువు చెబుతారు. 13వ శతాబ్ధంలో మాధవాచార్యుడిగా, 16 వ శతాబ్ధంలో తులసీదాస్ గా, 17వ శతాబ్దంలో సమర్త్ రామదాసుగా, 17వ శతాబ్ధంలోనే రాఘవేంద్రస్వామిగా, 20వ శతాబ్ధంలో స్వామి రామదాస్ గా కనిపించాడని చెబుతారు.

శాశ్వత స్థానం
హనుమంతుడు ఏడుగురు చిరంజీవుల్లో ఒకరు. అంటే తర్వాత సత్యయుగం వరకు జీవించి ఉంటారని అర్థం. సీతా దేవి ఇచ్చిన ముత్యాల హారాన్ని హనుమంతుడు స్వీకరించలేదు. రాముడు లేని ఎలాంటి వస్తువుని తాను తీసుకోనని సీతకు చెప్పాడు. అదే సమయంలో.. తనలో ఎప్పుడూ రాముడు అమరంగా ఉంటాడని.. తన గుండె చీల్చి చూపిస్తాడు.

హనుమంతుడి పాదాలు తాకడానికి మహిళలు దూరం
హనుమాన్ జయంతి రోజు భక్తులు సింధూరం రాసుకుని.. హనుమంతుడి ఆలయాలు దర్శిస్తారు. కోతులకు అరటిపండ్లు తినిపించి.. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. హనుమంతుడు బాల బ్రహ్మచారి. కాబట్టి.. హనుమంతుడిని మహిళలు పూజించవచ్చు. కానీ.. ఆయన విగ్రహాన్ని తాకడానికి వీలులేదు.

సింధూరం ఎందుకు ?
ఒకసారి సీతాదేవి తన నుదిటిపై సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు.. ఎందుకు అక్కడ సింధూరం పెట్టుకున్నారని సీతను అడికాడు. తన భర్తైన రాముడి బాగుండాలని, ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటూ పెట్టుకున్నానని చెబుతాడు. వెంటనే హనుమంతుడు తన శరీరాన్నంతటికీ సింధూరం రాసుకున్నాడు.. ఎందుకు అంటే.. రాముడు కలకాలం ఉండాలని చెప్పాడు. కాబట్టి.. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పిస్తే.. మీ కోరిక నెరవేరుతుంది.



Click it and Unblock the Notifications











