Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మ వారిని ఎలా పూజించాలో తెలుసా?
దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆరు రోజుల పూజ పూర్తయ్యింది. రేపు అమ్మవారు ఏడవ రోజు పూజలు అందుకోనున్నారు. అయితే ఏడవ రోజు అమ్మవారికి ఏ విధమైన పూజలు చేయాలి, ఏ రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు? ఏ విధముగా అమ్మవారిని ఈరోజు పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారంటే:
నవరాత్రుల్లో ఏడవ రోజు దుర్గామాత అత్యంత భయంకరమైన, విధ్వంసకరమైన కాళరాత్రి రూపంలో దర్శనమివ్వనున్నారు. దుష్ట శక్తులను సంహరించడానికి, పాప వినాశనానికి, ధైర్యానికి ప్రతీకగా కాళరాత్రి రూపం ఉద్భవించింది. రాక్షసులు అమ్మవారిని దాడి చేసే క్రమంలో ఆమె బంగారు వర్ణపు చర్మం తొలిగిపోయి.. అమ్మవారు భీకరమైన రూపంలో దర్శనమిస్తారు. అందుకే కాళరాత్రి అని పిలుస్తారు.

కాళరాత్రి రూపం ప్రాముఖ్యత ఏమిటి?:
కాళరాత్రి రూపంలో అమ్మవారు రాయల్ బ్లూ రంగును ధరిస్తుంది. ఆ రంగులోనే భక్తులకు దర్శమిస్తుంది. ఈ రూపంలో మంచి, చెడును సరిసమానంగా చూస్తుంది. చెడు చేసే రాక్షసులను సంహరించి, మంచి మార్గం వైపు నడిచే వారిని ప్రోత్సహిస్తుంది. దుష్టులు, భూత ప్రేతాల నుంచి తన భక్తులను రక్షించుకుంటూ లోకాన్ని పాలిస్తుంది. జాతకచక్రములో శనిగ్రహం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు కాళరాత్రి రూపంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే ఫలితం ఉంటుందని ప్రతీతి.
కాళరాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి?:
అర్ధరాత్రి వికసించే జాస్మిన్ పూలతో కాళరాత్రి రూపంలో ఉండే అమ్మవారిని పూజిస్తే తలితం ఉంటుంది. గణపతి పూజతో ప్రారంభించి, షోడశోపచారాలతో పూజను కొనసాగించాలి. చివరిలో హారతితో పూజను ముగించాల్సి ఉంటుంది. ఇలా పూజిస్తే భక్తులకు తన ధైర్య సాహసాలు ప్రసాదించడంతో పాటు, భక్తుల వెన్నంటే ఉంటూ.. వారికి ఏ ఆపద దరి చేరనివ్వకుండా రక్షిస్తుంది.



Click it and Unblock the Notifications











