Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మ వారిని ఎలా పూజించాలో తెలుసా?
దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆరు రోజుల పూజ పూర్తయ్యింది. రేపు అమ్మవారు ఏడవ రోజు పూజలు అందుకోనున్నారు. అయితే ఏడవ రోజు అమ్మవారికి ఏ విధమైన పూజలు చేయాలి, ఏ రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు? ఏ విధముగా అమ్మవారిని ఈరోజు పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారంటే:
నవరాత్రుల్లో ఏడవ రోజు దుర్గామాత అత్యంత భయంకరమైన, విధ్వంసకరమైన కాళరాత్రి రూపంలో దర్శనమివ్వనున్నారు. దుష్ట శక్తులను సంహరించడానికి, పాప వినాశనానికి, ధైర్యానికి ప్రతీకగా కాళరాత్రి రూపం ఉద్భవించింది. రాక్షసులు అమ్మవారిని దాడి చేసే క్రమంలో ఆమె బంగారు వర్ణపు చర్మం తొలిగిపోయి.. అమ్మవారు భీకరమైన రూపంలో దర్శనమిస్తారు. అందుకే కాళరాత్రి అని పిలుస్తారు.

కాళరాత్రి రూపం ప్రాముఖ్యత ఏమిటి?:
కాళరాత్రి రూపంలో అమ్మవారు రాయల్ బ్లూ రంగును ధరిస్తుంది. ఆ రంగులోనే భక్తులకు దర్శమిస్తుంది. ఈ రూపంలో మంచి, చెడును సరిసమానంగా చూస్తుంది. చెడు చేసే రాక్షసులను సంహరించి, మంచి మార్గం వైపు నడిచే వారిని ప్రోత్సహిస్తుంది. దుష్టులు, భూత ప్రేతాల నుంచి తన భక్తులను రక్షించుకుంటూ లోకాన్ని పాలిస్తుంది. జాతకచక్రములో శనిగ్రహం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు కాళరాత్రి రూపంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే ఫలితం ఉంటుందని ప్రతీతి.
కాళరాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి?:
అర్ధరాత్రి వికసించే జాస్మిన్ పూలతో కాళరాత్రి రూపంలో ఉండే అమ్మవారిని పూజిస్తే తలితం ఉంటుంది. గణపతి పూజతో ప్రారంభించి, షోడశోపచారాలతో పూజను కొనసాగించాలి. చివరిలో హారతితో పూజను ముగించాల్సి ఉంటుంది. ఇలా పూజిస్తే భక్తులకు తన ధైర్య సాహసాలు ప్రసాదించడంతో పాటు, భక్తుల వెన్నంటే ఉంటూ.. వారికి ఏ ఆపద దరి చేరనివ్వకుండా రక్షిస్తుంది.



Click it and Unblock the Notifications