Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సూర్యస్తమయం తర్వాత పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట.. చేస్తే సంపద కోల్పోతారట...!
సూర్యస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఎందుకని దానం ఇవ్వకూడదో కారణాలను తెలుసుకుందాం.
సాధారణంగా హిందూ సంప్రదాయంలో దానధర్మాలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు మన పెద్దకాలం నుండి ఆనవాయితీగా వస్తున్నాయి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రస్తుత కలియుగంలో మీరు నిరంతరం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిరంతరం చేయలేకపోయినా.. ఎవరికైనా ఏదైనా వస్తువులను, సొమ్మును దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుందని పండితులు చెబుతారు.

అయితే దానధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యస్తమయం అస్సలు దానం చేయకూడదట. ఒకవేళ అలా చేస్తే మీరు చాలా ధనం నష్టపోతారట. ఈ సందర్భంగా సాయంకాలం వేళ ఎందుకని వస్తువులను దానం చేయకూడదు.. ఏయే వస్తువులు దానం చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెరుగు ఇవ్వరాదు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం చాలా మంచిది. మనలో చాలా మంది రాత్రి వేళలో పేదలకు, పొరుగువారికి పెరుగును దానం చేస్తూ ఉంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ సూర్యస్తమయం తర్వాత పేదలకు, శరణార్థులకు ఎట్టి పరిస్థితుల్లో పెరుగును దానంగా ఇవ్వరాదంట. ఎందుకంటే ఇది శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు మనలో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి మీరు సూర్యస్తమయం తర్వాత అంటే చీకటి పడిన తర్వాత పెరుగును దానం చేస్తే మీ కుటుంబ జీవితంలో సంతోషం తగ్గుతుంది.

డబ్బు ఇవ్వకూడదు..
సూర్యస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదట. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

ఉల్లిపాయ, వెల్లుల్లి..
మన కాలనీలో లేదా అపార్ట్ మెంట్లలో నిత్యం పక్కింటి వారో.. ఎదిరింటో వారో లేదా ఇంకెవరైనా నిత్యం ఏదో ఒక పదార్థాన్ని లేదా వస్తువులను అప్పుగా అడుగుతూ ఉంటారు. అందులోనూ వంట చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని అరువుగా అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి వస్తువులను సూర్యస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పుగా, దానంగా ఇవ్వకూడదట. దీని వల్ల మీకు చెడు ఫలితాలొస్తాయని, మీకు ఇవి ప్రాణాంతకంగా ఉంటాయని చెబుతారు.

పాల దానం నిషేధం..
సాధారణంగా పాలను దానం చేయడాన్ని ఎల్లప్పుడూ శుభప్రదంగా భావిస్తారు. అయితే సూర్యస్తమయం తర్వాత మాత్రం పాలను దానం చేయకూడదట. ఎందుకంటే పాలు.. సూర్యుడు, చంద్రుడు రెండింటికి సంబంధించినదిగా చెబుతారు.

దేవుళ్ల ఆగ్రహం..
సూర్యస్తమయం తర్వాత పాలను దానం చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కోపం పడతారట. దీని వల్ల మీ జీవితంపై అది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందట. అందుకే మీరు పొరపాటున కూడా పాలను ఆ సమయంలో దానం చేయకండి.

ఉప్పు..
సూర్యస్తమయం తర్వాత మన వంటింట్లో నిత్యావసర సరుకైన ఉప్పును దానంగా ఇవ్వకూడదట. ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. ఒకవేళ ఉప్పును ఆ సమయంలో ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవిని వారి ఇంటికి పంపినట్టు అవుతుందట. అందుకే సూర్యస్తమయం తర్వాత ఉప్పును దానంగా లేదా అప్పుగా ఇవ్వకండి. ఇప్పటికీ దుకాణాల్లో కూడా చీకటి పడితే ఉప్పును విక్రయించరు.



Click it and Unblock the Notifications











