Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
రాముడికి వీరాభిమాని గుహుడు, రాముడు గంగానది దాటుతుంటే ప్రాణం పోతున్నట్లుగా భావిస్తాడు
గుహుడిన తన దగ్గరకు పిలుచుకుంటాడు రాముడు. నేను వెళ్తుంటే నీకు బాధగా ఉండొచ్చు కానీ నేను మాటిచ్చాను. వెళ్లక తప్పదు అంటాడు రాముడు. సరే ఇక నుంచి నేను ఆశ్రమంలో ఉండాలి. మా వెంట్రుకలను జటలుగా మార్చుకోవాల్సి వ
గుహుడు నిషాద రాజు. ఆయనకు మంచితనం చాలా ఎక్కువ. రాముడికి పెద్ద భక్తిపరుడిగా, నమ్మిన వ్యక్తి మారాడు గుహుడు. శ్రీరాముడు సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరుతాడు.

అయితే గంగానది తీరంలో ఉండే శృంగి బేరపురం అనే ప్రాంతంలో వారు కాసేపు ఉంటారు. అది గుహుడి రాజ్యం పరిధిలోకి వస్తుంది. రాముడు అక్కడ ఉన్నాడని తెలిసి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్తాడు గుహుడు.

మర్యాదలు
సీతారామలక్ష్మణులకు అన్ని రకాలుగా మర్యాదలు చేస్తాడు. గుహుడితో ఎంతో స్నేహంగా మాట్లాడుతాడు రాముడు. శ్రీరాముచంద్రుడిని చూడగానే తన జన్మ ధన్యమైందన్నట్లుగా భావిస్తాడు గుహుడు. పెద్ద రాజ్యానికి రాజైనా గుహుడు రాముడి దగ్గర సామాన్యుడిలా నిల్చుంటాడు.

శ్రీరాముడిని దేవుడిగా
తాను రాముడి రాజ్యాన్ని పొందాను అని శ్రీరాముడిని ఎప్పటి నుంచో దేవుడిగా భావించే వ్యక్తి గుహుడు. అలాంటి రాములవారు తన రాజ్యానికి రాగానే వారికి సకల మర్యాదలు చేస్తాడు. అయితే సీతారాములవారు కిందపడుకోవడం ఆయన్ని బాధిస్తుంది.

గంగానది దాటి
ఇక తరువాత సీతారాములవారితో పాటు లక్ష్మణుడు గంగానది దాటి ఆవలవైపు వెళ్లేందుకు బయల్దేరుతాు. రాముడి ఆదేశం మేరకు ఒక నావను సిద్ధం చేశాడు గుహుడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఉన్నాడు. కానీ గుహుడు మాత్రం చాలా బాధతో ఉంటాడు.

బాధగా ఉండొచ్చు
గుహుడిన తన దగ్గరకు పిలుచుకుంటాడు రాముడు. నేను వెళ్తుంటే నీకు బాధగా ఉండొచ్చు కానీ నేను మాటిచ్చాను. వెళ్లక తప్పదు అంటాడు రాముడు. సరే ఇక నుంచి నేను ఆశ్రమంలో ఉండాలి. మా వెంట్రుకలను జటలుగా మార్చుకోవాల్సి వస్తుంది. మాకు కాస్త మర్రిపాలను తెప్పించవా అంటాడు.

మర్రిపాలు తెప్పిస్తాడు
వెంటనే మర్రిపాలు తెప్పిస్తాడు గుహుడు. వాటిని వెంట్రుకలు పూసుకుని జటలుగా మార్చుకుంటారు రామలక్ష్మణులు. తర్వాతనావలో సీతాదేవితో రామలక్ష్మణులు ఎక్కారు. గుహుడికి వెళ్తొస్తామని చెబుతూ చెయ్యి ఊపాడు.

సంతోషంగా ఉండాలి
మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని గుహుడు రాములవారితో అంటారు. తర్వాత రాముడి నావ వెళ్తుంటే దానివైపే చూస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మనస్సున్న వ్యక్తి నా శ్రీరామచంద్రుడు... ఇచ్చిన మాట కోసం సకలభోగాలను వదిలేసి వెళ్తున్నాడు అనుకుంటాడు గుహుడు. రాముడు గంగానది దాటిపోతుంటే తన ప్రాణం పోతున్నట్లుగా భావిస్తాడు. అంతటి అమోఘన అభిమానం గుహుడికి రాముడిపై ఉంది.

సకల మర్యాదలు
తర్వాత రాముడిని వెతుక్కుంటూ వచ్చిన భరతుడికి కూడా సకల మర్యాదలు చేస్తాడు. రాముడికి పెద్ద ఫ్యాన్ గుహుడు. ఆయన కోసం ఏదైనా చెయ్యడానికి సిద్దపడ్డ వ్యక్తి. తన జీవితాంతం రాముడినే ఆదర్శంగా తీసుకుని రాజ్యపాలన సాగించాడు గుహుడు.



Click it and Unblock the Notifications