Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?
హిందూ దేవుళ్లలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలకు కూడా తమ పనులు నిర్వర్థించే ముందు వినాయకుడుని దర్శించుకుని, విజయాలను సాధించే వారు. అలాగే సామన్య ప్రజలు కూడా తమ రోజువారి పనులలో కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అంతే కాదు, దక్షిణాయనంలో జరుపుకునే హిందూ పండుగలలో మొదట వచ్చేది కూడా వినాయక చవితియే..!

అటువంటి వినాయకునికి ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రిఆహారాలను తినే ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గణేశునికి పత్రి అంటే ఎంతో ఇష్టం. అందువల్లే పత్రితో గణేశున్ని ఆధ్యాత్మికంగా పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అందుకే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలనూ, పూలను తీసుకువచ్చి, పూజించడం సాంప్రదాయం. వినాయకునికి చేసే ఈపూజకు ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి అయితే ఆ ప్రతాలలో తులసీ దళానికి చోటు ఉండదు.
సర్వదేవతలకు పవిత్రమైన తులసి పత్రం వినాయకుడు ఇష్టపడక పోవడానికి కారణము. . .

ఓ సారి గంగా నది తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది.
దానికి వినాయకుడు కాదనండంతో ధర్మద్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘ కాలం ఉండమని శపిస్తాడు. వినాయకుడి శాపానికి చింతించిన ధర్మద్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆ పై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

అందుకే వినాయకుడు తులసిని తన పూజ పత్రిలో ఇష్టపడడు...



Click it and Unblock the Notifications











