Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?
హిందూ దేవుళ్లలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలకు కూడా తమ పనులు నిర్వర్థించే ముందు వినాయకుడుని దర్శించుకుని, విజయాలను సాధించే వారు. అలాగే సామన్య ప్రజలు కూడా తమ రోజువారి పనులలో కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అంతే కాదు, దక్షిణాయనంలో జరుపుకునే హిందూ పండుగలలో మొదట వచ్చేది కూడా వినాయక చవితియే..!

అటువంటి వినాయకునికి ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రిఆహారాలను తినే ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గణేశునికి పత్రి అంటే ఎంతో ఇష్టం. అందువల్లే పత్రితో గణేశున్ని ఆధ్యాత్మికంగా పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అందుకే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలనూ, పూలను తీసుకువచ్చి, పూజించడం సాంప్రదాయం. వినాయకునికి చేసే ఈపూజకు ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి అయితే ఆ ప్రతాలలో తులసీ దళానికి చోటు ఉండదు.
సర్వదేవతలకు పవిత్రమైన తులసి పత్రం వినాయకుడు ఇష్టపడక పోవడానికి కారణము. . .

ఓ సారి గంగా నది తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది.
దానికి వినాయకుడు కాదనండంతో ధర్మద్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘ కాలం ఉండమని శపిస్తాడు. వినాయకుడి శాపానికి చింతించిన ధర్మద్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆ పై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

అందుకే వినాయకుడు తులసిని తన పూజ పత్రిలో ఇష్టపడడు...



Click it and Unblock the Notifications