Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?
హిందూ దేవుళ్లలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలకు కూడా తమ పనులు నిర్వర్థించే ముందు వినాయకుడుని దర్శించుకుని, విజయాలను సాధించే వారు. అలాగే సామన్య ప్రజలు కూడా తమ రోజువారి పనులలో కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అంతే కాదు, దక్షిణాయనంలో జరుపుకునే హిందూ పండుగలలో మొదట వచ్చేది కూడా వినాయక చవితియే..!

అటువంటి వినాయకునికి ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రిఆహారాలను తినే ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గణేశునికి పత్రి అంటే ఎంతో ఇష్టం. అందువల్లే పత్రితో గణేశున్ని ఆధ్యాత్మికంగా పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అందుకే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలనూ, పూలను తీసుకువచ్చి, పూజించడం సాంప్రదాయం. వినాయకునికి చేసే ఈపూజకు ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి అయితే ఆ ప్రతాలలో తులసీ దళానికి చోటు ఉండదు.
సర్వదేవతలకు పవిత్రమైన తులసి పత్రం వినాయకుడు ఇష్టపడక పోవడానికి కారణము. . .

ఓ సారి గంగా నది తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది.
దానికి వినాయకుడు కాదనండంతో ధర్మద్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘ కాలం ఉండమని శపిస్తాడు. వినాయకుడి శాపానికి చింతించిన ధర్మద్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆ పై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

అందుకే వినాయకుడు తులసిని తన పూజ పత్రిలో ఇష్టపడడు...



Click it and Unblock the Notifications