Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?
హిందూ దేవుళ్లలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలకు కూడా తమ పనులు నిర్వర్థించే ముందు వినాయకుడుని దర్శించుకుని, విజయాలను సాధించే వారు. అలాగే సామన్య ప్రజలు కూడా తమ రోజువారి పనులలో కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అంతే కాదు, దక్షిణాయనంలో జరుపుకునే హిందూ పండుగలలో మొదట వచ్చేది కూడా వినాయక చవితియే..!

అటువంటి వినాయకునికి ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రిఆహారాలను తినే ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గణేశునికి పత్రి అంటే ఎంతో ఇష్టం. అందువల్లే పత్రితో గణేశున్ని ఆధ్యాత్మికంగా పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అందుకే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలనూ, పూలను తీసుకువచ్చి, పూజించడం సాంప్రదాయం. వినాయకునికి చేసే ఈపూజకు ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి అయితే ఆ ప్రతాలలో తులసీ దళానికి చోటు ఉండదు.
సర్వదేవతలకు పవిత్రమైన తులసి పత్రం వినాయకుడు ఇష్టపడక పోవడానికి కారణము. . .

ఓ సారి గంగా నది తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది.
దానికి వినాయకుడు కాదనండంతో ధర్మద్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘ కాలం ఉండమని శపిస్తాడు. వినాయకుడి శాపానికి చింతించిన ధర్మద్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆ పై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

అందుకే వినాయకుడు తులసిని తన పూజ పత్రిలో ఇష్టపడడు...



Click it and Unblock the Notifications