Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అశ్వత్థామను శ్రీకృష్ణుడు మరణం లేకుండా ఎందుకు శపించాడో తెలుసా..?
కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపులా లక్ష మంది చనిపోవడం వల్ల ఇటు పాండవులకు అటు కౌరవులకు చాలా అసహ్యం కలిగింది.అశ్వత్థామకు అయినా కోపం ఆగలేదు. నిద్రపోతున్న పిల్లను చంపాడు. అశ్వద్ధామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు చావు వుండకూదని శపించాడు. అతను పగతోనే చేసిన తప్పు కాబట్టి అదే బాధతో జీవితం మొత్తం అలాగే చావు లేకుండా వుండాలని శపించాడు.
డబ్బు సంతోషం వుండగానే చాలా సంతోషంగా జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ చావు రాకపోవడం చాలా బాధాకరమైన అంశంగా మనం పరిగణించాలి.10 లక్షల సంవత్సరాల వరకు మీరు చావకుండా ఇక్కడే వుంటే అది చాలా దారుణంగా వుంటుంది. చావు లేకపోవడం వల్ల చాలా ఘోరంగా వుంటుంది. అది పెద్ద శిక్షతో సమానం. అందుకే కృష్ణుడు అశ్వద్ధామను నువ్వెప్పుడు అపరాధ భావంతోనే జీవించాలని శపించాడు.

యుధ్ధం జరిగినప్పుడు మనిషిలో చాలా ఘోరమైన ఆలోచనలు వుంటాయ్. యుద్ధం జరక్కుడా ఆపడానికి కృష్ణుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఒక సారి యుద్ధం మొదలైన తరువాత కృష్ణుడు కూడా ఆపలేకపోయాడు. యుద్ధం పోరాడక తప్పదు అందువల్ల పోరాడారు. ఈ పోరాటంలో చాలా మంది చనిపోయారు. మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అన్ని రకాల మనుషులు మరణించారు. కానీ యుద్ధం తరువాత వెళ్లి పిల్లలను చంపితే వారు ఎప్పుడూ బాధలోనే వుండాలి అని కృష్ణుడు అలా శపించాడు.
యుద్ధం ఓడిపోయారనే బాధతో అశ్వద్ధామ అలా చేశాడు. గెలిచి వుంటే అలాంటి పనులు చేసేవాడు కాదు. ఓడిపోతూ వెళ్లి బాధతో పిల్లలను చంపాడు. మనం యుద్దం చేస్తాము. ఓడిపోతాం, గెలుస్తాం. కానీ ఓడిపోయిన తరువాత అది తట్టుకోలేక రాత్రి పడుకున్న పిల్లలను చంపుతానడం చాలా ఘోరం. శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. కొన్ని చెడ్డపనులు చేసిన వారికి కూడా కొన్ని శిక్షలు వేసి తప్పించవచ్చు. కానీ అశ్వద్ధామకు మాత్రం వేరే మార్గం లేదు. శాశ్వతంగా అలాగే జీవించాలని శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు శాపం పెట్టాడు.
అశ్వథ్తాముడు మహాభారతంలో ద్రోణుడికి కొడుకు. ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన శిశ్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మొత్తం ముగ్గురు కౌరవులు మాత్రమే మిగుల్తారు. ఆ ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలను ప్రముఖ పండితులు, ఇంటర్నెట్ నుంచి సేకరించినవి. కాబట్టి మేము వీటిని ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications











