Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
అశ్వత్థామను శ్రీకృష్ణుడు మరణం లేకుండా ఎందుకు శపించాడో తెలుసా..?
కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపులా లక్ష మంది చనిపోవడం వల్ల ఇటు పాండవులకు అటు కౌరవులకు చాలా అసహ్యం కలిగింది.అశ్వత్థామకు అయినా కోపం ఆగలేదు. నిద్రపోతున్న పిల్లను చంపాడు. అశ్వద్ధామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు చావు వుండకూదని శపించాడు. అతను పగతోనే చేసిన తప్పు కాబట్టి అదే బాధతో జీవితం మొత్తం అలాగే చావు లేకుండా వుండాలని శపించాడు.
డబ్బు సంతోషం వుండగానే చాలా సంతోషంగా జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ చావు రాకపోవడం చాలా బాధాకరమైన అంశంగా మనం పరిగణించాలి.10 లక్షల సంవత్సరాల వరకు మీరు చావకుండా ఇక్కడే వుంటే అది చాలా దారుణంగా వుంటుంది. చావు లేకపోవడం వల్ల చాలా ఘోరంగా వుంటుంది. అది పెద్ద శిక్షతో సమానం. అందుకే కృష్ణుడు అశ్వద్ధామను నువ్వెప్పుడు అపరాధ భావంతోనే జీవించాలని శపించాడు.

యుధ్ధం జరిగినప్పుడు మనిషిలో చాలా ఘోరమైన ఆలోచనలు వుంటాయ్. యుద్ధం జరక్కుడా ఆపడానికి కృష్ణుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఒక సారి యుద్ధం మొదలైన తరువాత కృష్ణుడు కూడా ఆపలేకపోయాడు. యుద్ధం పోరాడక తప్పదు అందువల్ల పోరాడారు. ఈ పోరాటంలో చాలా మంది చనిపోయారు. మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అన్ని రకాల మనుషులు మరణించారు. కానీ యుద్ధం తరువాత వెళ్లి పిల్లలను చంపితే వారు ఎప్పుడూ బాధలోనే వుండాలి అని కృష్ణుడు అలా శపించాడు.
యుద్ధం ఓడిపోయారనే బాధతో అశ్వద్ధామ అలా చేశాడు. గెలిచి వుంటే అలాంటి పనులు చేసేవాడు కాదు. ఓడిపోతూ వెళ్లి బాధతో పిల్లలను చంపాడు. మనం యుద్దం చేస్తాము. ఓడిపోతాం, గెలుస్తాం. కానీ ఓడిపోయిన తరువాత అది తట్టుకోలేక రాత్రి పడుకున్న పిల్లలను చంపుతానడం చాలా ఘోరం. శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. కొన్ని చెడ్డపనులు చేసిన వారికి కూడా కొన్ని శిక్షలు వేసి తప్పించవచ్చు. కానీ అశ్వద్ధామకు మాత్రం వేరే మార్గం లేదు. శాశ్వతంగా అలాగే జీవించాలని శ్రీకృష్ణుడు అశ్వద్ధామకు శాపం పెట్టాడు.
అశ్వథ్తాముడు మహాభారతంలో ద్రోణుడికి కొడుకు. ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన శిశ్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మొత్తం ముగ్గురు కౌరవులు మాత్రమే మిగుల్తారు. ఆ ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలను ప్రముఖ పండితులు, ఇంటర్నెట్ నుంచి సేకరించినవి. కాబట్టి మేము వీటిని ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications