Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
గర్భవతులను పాము కాటు వెయ్యదా? బ్రహ్మవైవర్త పురాణం ఏం చెబుతుందో తెలుసా?
హిందూమతంలో అనేకానేక ఆచారాలు పాటిస్తుంటారు. భారత్ లో ఉన్న అనేక మతాలు, కులాలు వివిధ ఆచార సాంప్రదాయాలను అవలంబిస్తుంటాయి. అలాగే వివిధ సంస్కృతి సాంప్రదాయాలపై వివిధ రకాల నమ్మకాలు కలిగి ఉంటాం. ఏదైనా విషయాన్ని నమ్ముతుంటే కొంత మంది వాటిని మూఢనమ్మకాలు అనవచ్చు. పురాణాల్లో, వేదాల్లో ఎన్నో రకాల విషయాలు ఉంటాయి.

కొన్నింటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. అలాంటి వాటిలో బ్రహ్మవైవర్త పురాణం ఒకటి. ఈ పురాణం ప్రకారం గర్భిణులను పాము కాటు వేయదని నమ్ముతుంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం గర్భిణిల వద్దకు పాము వెళ్లదు.. అలాగే గర్భిణీలను చూడగానే పాములు చూపు కోల్పోతాయి. ఈ పురాణం ప్రకారం గర్భిణీలను పాములు ఎందుకు కాటు వేయ్యదో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భవతులను పాములు ఎందుకు కాటెయ్యవంటే?
మనుషులకు ఇంద్రియాలు ఉన్నట్లుగానే పాముకు కూడా కొన్ని ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాలను పాములు ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాటి ద్వారానే పాములు జీవిస్తాయి. మనిషికి ఇంద్రియాలు ఎంత ముఖ్యమో.. పాము జీవితంలో కూడా ఇంద్రియాలు అంతే ముఖ్యమైనవి.
ఈ ఇంద్రియాలతోనే పాములు స్త్రీని చూసి గర్భిణీ అవునో కాదో స్ఫష్టంగా గుర్తించగలుగుతుందట. గర్భం ధరించిన సమయంలో మహిళల్లో వచ్చే మార్పులను పాములు గుర్తిస్తాయని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ఇలా గుర్తించిన పాములు గర్భిణీలను కాటు వేయవని చెబుతోంది పురాణం. ఒకప్పుడు ఓ గర్భిణీ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర తపస్సు చేస్తుంది. ఆమె శివ తపస్సులో మునిగి ఉన్న సమయంలో రెండు పాముల వల్ల ఆమె తపస్సుకు భంగం కలుగుతుంది. ఆమె అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల వచ్చిన శక్తితో తన గర్భంలో ఉన్న పిండాన్ని గుర్తించగలుగుతుంది.
తన కడుపులో బిడ్డ సర్పజాతికి చెందినది కావడంతో పాటు తన తపస్సుకు భంగం కలిగించిన ఆ పాములను ఆ గర్భిణీ శపిస్తుంది. గర్భిణీలను చూడగానే పాముల కళ్లు కనిపించకూడదని ఆమె శాపం పెట్టింది అప్పటి నుంచి గర్భిణీని చూడగానే పాములు గుడ్డివి అయిపోవడంతో పాటు గర్భిణీలను కాటు వేయడానికి సాహసించవని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అలాగే గర్భిణీలకు కలలో కూడా పాములు కనిపించవని కూడా అంటారు.
శాస్త్రం ఏం చెబుతోందంటే..
గర్భిణీని పాము కాటు వేయకపోవడానికి విశ్వాసం ఒక కారణం అయితే. శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గర్భవతి అయిన తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అందులో హార్మోన్ల మార్పు కూడా ఒకటి. గర్భం ధరించిన స్త్రీ శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పుపు జరుగుతాయి. వీటి వల్ల స్త్రీ స్వభావం, ఆసక్తి, రంగు రూపుల్లో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భిణీ స్త్రీలలో వచ్చే ఈ మార్పులను పాములు తమ ఇంద్రియాలతో గుర్తిస్తాయని, అందుకే గర్భిణీల వద్దకు వెళ్లవని అంటుంటారు. అయితే ఈ విషయంపై ఎలాంటి శాస్త్రీయా ఆధారాలు లేకపోవడం గమనార్హం.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications