Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వింటర్లో డ్రైగా మారిన స్కిన్ ను సాప్ట్ గా.. మాయిశ్చరైజింగ్ గా మార్చే సింపుల్ టిప్స్
వింటర్ చలిగాలి చల్లగా వచ్చి మేనిని తాకుతుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ తరువాతే చర్మం పొడిబారిపోయి అందవికారంగా తయారవుతుంది. పొడి చర్మంతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కిన్ మాయిశ్
శీతాకాలం వచ్చిందంటే చాలు సమస్యలు చుట్టుముడుతాయి. చలి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందాన్ని వికారంగా మారుస్తుంది. చాలా మంది మహిళలు, టీనేజ్ గర్ల్స్ కు శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి తగినంత శ్రధ్ద తీసుకోవడం చాలా అవసరం. ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంత అవుంతి.
వింటర్ చలిగాలి చల్లగా వచ్చి మేనిని తాకుతుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ తరువాతే చర్మం పొడిబారిపోయి అందవికారంగా తయారవుతుంది. పొడి చర్మంతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కిన్ మాయిశ్చరైజ్ అయి కాంతులీనుతూ ఉంటుంది.

పాలు-సున్నిపిండితో స్నానం:
చలికాలంలో సబ్బులు ఉపయోగించకుండా ఉండటం మంచిది. పొడిచర్మం ఉన్నవాళ్లు పాలల్లో సున్నిపిండిని కలిపి మర్దనా చేస్తే చర్మం పొడిబారకుండా సున్నితంగా ఉంటుంది.

ఆయిల్ మసాజ్ :
వారానికోసారి గోరు వెచ్చని నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత సున్నిపిండితో స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు రాలిపోవడమే కాదు చర్మం సున్నితంగా ఉంటుంది.

శెనగపిండిఫేస్ ప్యాక్ :
శనగపిండిలో నువ్వుల నూనె, కొద్దిగా పసుపు, తేనె, ఒక స్పూను పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మర్దనా చేసి పది నిమిషాలు ఆగి కడిగేయాలి. చర్మం మృదువుగా తయారవుతుంది. దీనినే చేతులకూ కాళ్లకూ ఉపయోగించవచ్చు.

స్కిన్ కు వాటర్ తో హైడ్రేషన్ అందివ్వాలి:
శీతాకాలంలో దాహం ఎక్కువగా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి.

మాయిశ్చరైజర్ తప్పనిసరి:
బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తరువాత గోరు నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

బాడీ మసాజ్ :
మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

సున్నిపిండితో స్నానం:
చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బును కాకుండా సున్నుపిండిని ఉపయోగించాలి. అంతేకాదు ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. 8. గ్లిజరిన్ లో రోజ్ వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లైచేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

నేచురల్ ఫేస్ ప్యాక్:
పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఫేస్ మాస్క్:
తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని మొఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.



Click it and Unblock the Notifications











