Latest Updates
-
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి!
షుగర్ వ్యాధి ఉన్నవారు సంతోషంగా తినగలిగే 18 పండ్లు
కొన్ని వైద్యసంస్థలు మరియు పౌష్టికాహార నిపుణులు పొందపరచిన వివిధ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ మనిషి తీసుకొనే ఆహారంతో పాటు 4-5 రకాల పండ్లను తీసుకోవడం చాలా అవసంర అని. మరి ఈ ప్రశ్న మధుమేహ గ్రస్తులకు వర్థిస్తుందా అంటే, రకరకాల పండ్లను వారు తీసుకోవడం వల్ల వారి సురక్షితమా అని వివిధ రాకాల ప్రశ్నలు వారిలో కలుగజేస్తాయి.
నిపుణుల ప్రకారం, మధుమేహగ్రస్తులు తీసుకొనే పండ్లు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల అవి మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయి నియంత్రలో ఉంటుంది. అయితే ఈ పండ్లును వారు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే మధుమేహ గ్రస్తులు తీసుకొనే పండ్లు రోజు ఆధారంగా అంటే మెదటి రోజుకి, రెండవ రోజుకి సమానంగా ఉండేలా సరిచూసుకోవాలి. శరీరంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల పండ్లు ఉదా: అరటి, లిచ్చీస్, చిక్కో మరియు సీతాఫలం వంటి పండ్లను తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. వీటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహ గ్రస్తులు తీసుకొనే కొన్ని రకాల పండ్లు గురించి తెలుసుకుందాం...

కివి పండు: కొన్ని పరోశోధనల ప్రకారం...కివి పండ్లు తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తక్కువ అవుతుందని దృఢపరిచారు.

బ్లాక్ జామున్(నేరేడు పండ్లు): మధుమేహగ్రస్తులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.

వైట్ జామూన్(తెల్ల నేరేడు పండ్లు): ఇవికూడా నేరేడు పండ్ల జాతివే. తెల్లనేరేడు పండ్లలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే శక్తి అందిస్తుంది. కాబట్టి వీటిని కూడా రోజూ తినవచ్చు.

స్టార్ ఫ్రూట్: నేరేడు పండ్లులాగే ఉండే ఈ స్టార్ ఫ్రూట్ మధుమేహ గ్రస్తులకు చాలా మంచిది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ ఫ్రూట్స్ తినడంతో పాటు మధుమేహ గ్రస్తులు కొంచెం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

జామకాయ(గోవా): జామకాయలో అధికశాతంలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మరియు మలబద్దకానికి మంచిది.

చెర్రీ: చెర్రీస్ లో GL (glycemic index) 20 ఉంటుంది. మధుమేహగ్రస్తులకు చెర్రీస్ ను ఓ మంచి స్నాక్ అని చెపవచ్చు. వీటిని రోజులో ఎప్పుడైపనా తినవచ్చు.

పీచెస్: ఈ ఫ్రూట్ చాలా మంచి టేస్ట్ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో GL తక్కువగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.

బెర్రీస్: బెర్రీస్ లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్పెబెర్రీ, క్రాన్ బెర్రీ, చోక్ బెర్రీ.. వీటిలో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా తినవచ్చు.

ఆపిల్స్: ఆపిల్స్ లో కూడా అధిక శాతంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది. శరీరంలో అన్ని జీవక్రియలు క్రమంగా పనిచేసేలా చేస్తాయి.

పైనాపిల్: పైనాపిల్ డైయాబెటిక్ పేషంట్స్ కు చాలా మంచిది. పైనాపిల్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫమేటరీగాను మరియు క్రిమినాశనకారిగాను పనిచేసే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు చాలా మంచిది.

బొప్పాయి: బొప్పాయి డయాబెటిక్ వారికి చాలా ఆరోగ్యకరం. ఇందులో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి.

ఫిగ్(అంజూర): అంజూర పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఫంక్షన్ కంట్రోల్ చేస్తుంది.

ఆరెంజ్: సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్లలో విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను ప్రతి రోజూ తినవచ్చు.

వాటర్ మెలోల్(పుచ్చకాయ): పుచ్చకాలో GL విలువలు తక్కువగా ఉండి మధుమేహగ్రస్తులు తినేందుకు ఉపయోగపడుతాయి. శరీరానికి కావల్సిన నీటి శాతాన్ని అంధిస్తుంది.

ద్రాక్ష: మధుమేహగ్రస్తుల శరీరంలో
చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతాయి.

దానిమ్మ: ఎరుపు రంగులో ఉండే దానిమ్మ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

పనసకాయ: పనసకాయలో విటమిన్ ఎ మిటమిన్ సి, థైమిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియంతో పాటు ఇతర న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది.

ఉసిరి కాయ: ఈ కాయల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఉసిరికాయలు మధుమేహగ్రస్తులకు చాలా ఆరోగ్యకరం.



Click it and Unblock the Notifications