మధుమేహమా ? ఐతే ఈ నియమాలు కంపల్సరీ

By Swathi

ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా.. అందరినీ వెంటాడుతున్న సమస్య మధుమేహం. వయసు పైబడిన వాళ్లనే కాదు.. చిన్న వయసులోనే డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కేవలం చక్కెర పదార్థాలకు మాత్రమే కాదు.. కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అసలు మధుమేహంతో బాధపడేవాళ్లు.. తీసుకోకూడని ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

diabetes

పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. మధుమేహం ఉన్నవాళ్లు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి అధ్యయనాలు. పాలలో ఉండే శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ బ్యాడ్‌ కొలెస్ర్టాల్‌ పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి బట్టర్‌, మీగడ పెరుగు, నెయ్యికి దూరంగా ఉండాలి. అవసరమైతే మీగడ తీసిన పెరుగు, మజ్జిగ, టోన్డ్‌ మిల్క్‌ తీసుకోవడం మంచిది.
fruits

మధుమేహంతో బాధపడేవాళ్లు పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడం మంచిది. పండ్ల రసాల వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని డైరెక్ట్ గా తినడం వల్ల ఎక్కువ పీచు పదార్థం పొందవచ్చు.

బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, గోధుమలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే.. వైట్ బ్రెడ్, వైట్ ఫ్లోర్, వైట్ రైస్ కి ఎంత నో చెబితే అంత మంచిది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశముంది.

chips

ఇక చిరుతిల్ల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఆలూ చిప్స్, పకోడి, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తీసుకోకపోవడం మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశముంది. అలాగే కూల్ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, January 27, 2016, 10:09 [IST]
Desktop Bottom Promotion