Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
షుగర్ ఉన్నవాళ్లు ఏ పండ్లు తినాలి? ఇదిగో నిపుణుల సలహాలు
షుగర్ వ్యాధి పేరు వింటేనే చలామందికి వెన్నెలో వణుకు పుడుతుంది. దీనికి కారణంగ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు గానీ పూర్తిగా నియంత్రించలేం. షుగర్ వ్యాధిని 100శాతం నయం చేసే మెడిసిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక ప్రపంచంలో ఏ దేశంలోని లేనంతమంది షుగర్ వ్యాధిగ్రస్థులు మన దేశంలోనే ఉన్నారు. అందుకే భారతదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ రాజధానిగా పిలుస్తుంటారు. షుగర్ వచ్చాక ఏది తినాలి, ఏది తినకూడదు అనే చాలా సందేహాలు, అనుమానాలు ఉంటుంటాయి.
షుగర్ వచ్చాక చాలామంది పండ్లు తినడం మానేస్తుంటారు, అయితే షుగర్ పేషెంట్లు పండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ పేషెంట్లు ఏ పండుల తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారు?
షుగర్ పేషెంట్లు సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచని పదార్థాలు అని అర్థం. మామిడి వంటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నా, చక్కెర శాతం కూడా ఎక్కువే. అందుకే వాటిని అల్పాహారంగా, భోజనాల మధ్యలో కొద్ది మొత్తంలో తీసుకోవాలి. అన్నం లేదా చపాతీ వంటి పిండిపదార్థాలతో కూడిన భోజనం చేశాక వెంటనే ఈ పండ్లను తింటే కేలరీలు, చక్కెర రెండూ పెరిగిపోతాయి. కనుక, కొన్ని పండ్ల విషయంలో ఆచితూచి అడుగేయాలి.
ఏవి తినాలి?
- స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నేరేడు పండ్ల వంటివి తినడం ఉత్తమం. వీటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి, చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి.
-అరటిపండుకు బదులుగా జామపండు: బాగా పండిన అరటిపండు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందుకే దీనికి బదులుగా జామపండును మీ డైట్లో చేర్చుకోండి. జామలో విటమిన్-సి, ఫైబర్ (పీచుపదార్థం) అధికంగా ఉంటాయి. 100 గ్రాముల జామపండులో కేవలం 5 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ.

సపోటాకు బదులుగా యాపిల్: తియ్యగా, గుజ్జుగా ఉండే సపోటా పండులో చక్కెర స్థాయి చాలా ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 65-70 వరకు ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో లేనివాళ్లు దీనికి దూరంగా ఉండటమే బెటర్. దీనికి బదులుగా రోజుకో యాపిల్ తినడం ఎంతో మంచిది. యాపిల్లో ఉండే ఫైబర్, రక్తంలో చక్కెర నెమ్మదిగా కలిసేలా చూస్తుంది. ఫైబర్ ఒక ఫిల్టర్ లా పనిచేసి, గ్లూకోజ్ వేగాన్ని నియంత్రిస్తుంది.
ద్రాక్షకు బదులుగా నేరేడు పండ్లు: రసాలూరే ద్రాక్ష పండ్లలో కూడా చక్కెర శాతమెక్కువే. సాధారణంగా 100 గ్రాముల ద్రాక్షలో 16-20 గ్రాముల చక్కెర ఉంటుంది. వీటికి బదులుగా సీజన్ లో దొరికే నేరేడు పండ్లను తినవచ్చు. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచే గుణాలు కూడా ఉన్నాయి.
పైనాపిల్ కు బదులుగా బొప్పాయి: పైనాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. కొన్ని ముక్కలు తిన్నా షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులుగా బొప్పాయి పండును నిరభ్యంతరంగా తినవచ్చు. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ తో నిండిన బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాక, మధుమేహులకు సురక్షితమైన పండు కూడా.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











