Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.!
ప్రస్తుత కాలంలో యువతను తుంటికి సంబంధించిన సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఈ సమస్య ఉండగా వారికి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యవారిలోనే ఈ సమస్యకు సంబంధించిన కేసులు నమోదవతున్నాయి. అసలు ఎందుకు ఈ సమస్య తీవ్రమవుతుంది.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్ను తీవ్రంగా వణికించింది. కరోనా బారి నుంచి బయటపడేందుకు దాదాపు 15 రోజులపైనే వెంటిలేటర్, ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందేవారు. ఆ సమయంలో తీసుకున్న స్టెరాయిడ్స్ వ్యాధి నుంచి బయటపడేసినా.. వాటి దుష్ప్రభావాలు ఇప్పుడు బయటపడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా యువతలో తుంటి శస్త్రచికిత్సలు 40 శాతం పెరిగాయని వెల్లడించారు. హిప్ ఆర్థరైటిస్, అవస్కులర్ నెక్రోసిస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధులుగా పరిగణించిన తుంటి సమస్యలు ఇప్పుడు యువతకి రావడం బాధాకరమని అంటున్నారు.
కారణాలేంటి..
తుంటి నొప్పి సమస్యలకు పలు కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తుంటి ఎముకలో రక్త ప్రసరణ సరిగా జరగనట్లయితే కణజాలం నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే అవస్కులర్ నెక్రోసిస్ అని పిలుస్తారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని వెల్లడించారు. కొవిడ్ కాలం తర్వాత తుంటి కీళ్ల సమస్యలు విపరీతంగా పెరిగి.. దేశవ్యాప్తంగా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలకు డిమాండ్ పెరిగిందని వివరించారు.
నిర్ధారణలో జాప్యం
చాలా మంది తుంటి నొప్పి సమస్యను త్వరగా గుర్తించకపోవడం ఈ సమస్య తీవ్రతకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం కారణంగా తుంటి కీలు పూర్తిగా దెబ్బ తిని కదలలేని పరిస్థితికి తీసుకువస్తుంది. తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి పూర్తి హిప్ సర్జరీ అవసరమని చెబుతున్నారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో కొంతమంది రోగులు స్టెరాయిడ్లను అధికంగా లేదా దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల ఆస్టియోనెక్రోసిస్ తీవ్రత పెరిగి తుంటి కీలులో మార్పులకు దారితీసిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తుంటి నొప్పి, తొడ ఎముక పై భాగం దెబ్బతినడం, తీవ్రమైన ఆర్థరైటిస్తో యువత బాధపడుతున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా సర్జరీ నిర్వహిస్తేనే ఈ సమస్యకు పరిష్కారమని తెలిపారు. ముందుగా వ్యాధిని నిర్ధారించినట్లయితే ఆరంభంలోని కోలుకోవచ్చని స్పష్టం చేశారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications