Latest Updates
-
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.! -
గ్రహణం రోజు ఈ పూజ తప్పనిసరిగా చేయాలట.. శాస్త్రాలు చెప్పే పూర్తి నియమాలు ఇవే!
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.!
ప్రస్తుత కాలంలో యువతను తుంటికి సంబంధించిన సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఈ సమస్య ఉండగా వారికి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యవారిలోనే ఈ సమస్యకు సంబంధించిన కేసులు నమోదవతున్నాయి. అసలు ఎందుకు ఈ సమస్య తీవ్రమవుతుంది.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్ను తీవ్రంగా వణికించింది. కరోనా బారి నుంచి బయటపడేందుకు దాదాపు 15 రోజులపైనే వెంటిలేటర్, ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందేవారు. ఆ సమయంలో తీసుకున్న స్టెరాయిడ్స్ వ్యాధి నుంచి బయటపడేసినా.. వాటి దుష్ప్రభావాలు ఇప్పుడు బయటపడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా యువతలో తుంటి శస్త్రచికిత్సలు 40 శాతం పెరిగాయని వెల్లడించారు. హిప్ ఆర్థరైటిస్, అవస్కులర్ నెక్రోసిస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధులుగా పరిగణించిన తుంటి సమస్యలు ఇప్పుడు యువతకి రావడం బాధాకరమని అంటున్నారు.
కారణాలేంటి..
తుంటి నొప్పి సమస్యలకు పలు కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తుంటి ఎముకలో రక్త ప్రసరణ సరిగా జరగనట్లయితే కణజాలం నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే అవస్కులర్ నెక్రోసిస్ అని పిలుస్తారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని వెల్లడించారు. కొవిడ్ కాలం తర్వాత తుంటి కీళ్ల సమస్యలు విపరీతంగా పెరిగి.. దేశవ్యాప్తంగా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలకు డిమాండ్ పెరిగిందని వివరించారు.
నిర్ధారణలో జాప్యం
చాలా మంది తుంటి నొప్పి సమస్యను త్వరగా గుర్తించకపోవడం ఈ సమస్య తీవ్రతకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం కారణంగా తుంటి కీలు పూర్తిగా దెబ్బ తిని కదలలేని పరిస్థితికి తీసుకువస్తుంది. తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి పూర్తి హిప్ సర్జరీ అవసరమని చెబుతున్నారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో కొంతమంది రోగులు స్టెరాయిడ్లను అధికంగా లేదా దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల ఆస్టియోనెక్రోసిస్ తీవ్రత పెరిగి తుంటి కీలులో మార్పులకు దారితీసిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తుంటి నొప్పి, తొడ ఎముక పై భాగం దెబ్బతినడం, తీవ్రమైన ఆర్థరైటిస్తో యువత బాధపడుతున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా సర్జరీ నిర్వహిస్తేనే ఈ సమస్యకు పరిష్కారమని తెలిపారు. ముందుగా వ్యాధిని నిర్ధారించినట్లయితే ఆరంభంలోని కోలుకోవచ్చని స్పష్టం చేశారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications