Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఉదయం లేవగానే లాగించేస్తున్నారా.. జాగ్రత్త! ఖాళీ కడుపుతో ఈ నాలుగు పదార్థాలు అస్సలే తినొద్దు!
చాలా మందికి ఉదయం లేవగానే టీ, కాఫీలతో పాటు పాలల్లో బూస్టు, హార్లిక్స్ వేసుకొని తాగడం అలవాటు. టీ, కాఫీలు మంచివి కావని చాలా మంది చెబుతుండగా.. మరికొందరు నిద్ర లేవగానే తేనె, నిమ్మరసం కలుపుకొని తాగుతున్నారు.
కానీ ఇది ఆరోగ్యానికి మంచి చేయడం కంటే ఎక్కువగా హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఈ నాలుగు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తనికూడదని సూచిస్తున్నారు. అయితే ఆ పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిమ్మరంలో తేనె కలిపి తాగడం మంచిది!
చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగుతారు. కానీ ఇది అస్సలే మంచిది కాదట. చెక్కరతో పోలిస్తే తేనెలో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్, క్యాలరీలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో దొరికే అధిక శాతం తేనె అంత స్వచ్ఛమైనది కాదని.. దాన్ని షుగర్ సిరప్ తో తయారు చేస్తున్నారని నిపుణులు వివరిస్తున్నారు. ఇలాంటి తేనెను పరగడుపును తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగడం వల్ల రోజూ సాధారణం కంటే అధికంగా ఆహారం తీసుకోవడానికి దారి తీస్తుందని వివరిస్తున్నారు.
2. టీ, కాఫీలు తాగితే రిఫ్రెష్గా ఉంటుంది!
భారత దేశంలో చాలా మంది ఉదయం లేని ఫ్రెష్ అయిన వెంటనే చేసే మొదటి పని టీ లేదా కాఫీ తాగడం. ఇది ఎంత లేటు అయినా సరే ఇవి తాగనిదే రోజు ప్రారంభం కాదు. వీటిని సేవించడం వల్ల ఏదో శక్తి వచ్చినట్లు అనిపించినా అవి మన కడుపులోని ఆమ్లాలను ప్రేరేపిస్తాయని వివరించారు. పరిగడుపునే తాగడం వల్ల కొన్ని జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
3. ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది!
ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక గిన్నెడు తాజా పండ్లను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని మనలో చాలా మంది అనుకుంారు. కానీ ఇది సరైనది కాదని.. ఇలాంటి అలవాటు ఉంటే మానుకుంటే ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. మిగతా ఆల్పాహారాలతో పోలిస్తే పండ్లు తొందరగా జీర్ణం అవుతాయని అందువల్ల గంట తిరక్కుండానే మళ్లీ ఆకలి అవుతుందని అందువల్ల గంట తిరగక ముందే ఆకలి అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీ కడుపుతో కొన్ని సిట్రస్ జాతి పండ్లు తినడం వల్ల ఎసిడిటీ వస్తుందని అన్నారు.
4. ఖాళీ కడుపుతో తీపి అల్పాహారం తింటే ఏం కాదు!
చాలా మంది తమ అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ వంటి తీపి పదార్థాలను తీసుకుంటారు. వీటి వల్ల అంత పెద్ద సమస్యలు లేకపోయినా.. ఇవి తీసుకోవడం వల్ల మాత్రం చిక్కుల్లో పడతారని తెలుపుతున్నారు. తీపి అల్పాహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర వెంటనే పెరిగి అదే స్థాయిలో తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ పదార్థాలు తినాలనే కోరిక కూడా పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే రుచికరమైన ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు వివరిస్తున్నారు. రుచికరమైన ఆహారం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయన్నారు.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications