కిచెన్ గార్డెన్ తో ఆరోగ్యమే మహా భాగ్యం..

Garden
మేడపైన ఖాళీ స్థలంలో కొంచెం శ్రద్ధగా పది కుండీలు పెట్టుకుంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ప్రతి కుటుంబమూ సునాయాశంగా పండించుకోవచ్చు. కిచెన్ గార్డెన్ లో ఆకుకూరలను మాత్రమే కాకుండా కూరగాయలతో పాటు అనేక రకాల పండ్లను కూడా పండించుకోవచ్చు.

మార్కెట్ లో కూరగాయలు, పండ్లు ధరలు ఆకాశన్నంటుతన్ను ఈ సమయంలో అనుకూలమైనటువంటి, వాతవరణంలో కూరగాయలమొక్కలు, ఆకకూరలు పెంచుకోవచ్చు. ఏ మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారో ఆ విత్తనాలను స్థానికంగా ఉన్న దుకాణాల్లో తెచ్చుకొని పండించుకోవచ్చు. కుంపట్లో చాలా త్వరగా పెరిగేటటువంటి విత్తనాలైన, కాకరకాయ, చిక్కుడు, బెండ, పచ్చిమిర్చి, టమోటో, వంకాయ వంటి విత్తనాలను చల్లుకొని ఏపుగా కూరగాయలను పండించుకోవచ్చు. అంతే కాకుండా మెంతాకు, తోటకూర కొత్తిమీర, పుదీనా వంటి ఆకు కూరలూ పండించుకోవచ్చు.

రసాయనిక ఎరువుల వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున, కేవలం పశువుల గెత్తం (ఎరువు), నల్లమట్టి కలిపి కుండీల్లో వేసుకోవచ్చు. నెలకోసారి కుండీల్లో అర అడుగు లోతున మట్టి తీసేసి, ఆ మేరకు కొత్తగా పశువుల ఎరువు, మట్టిని నింపుకోవాలి.

చీడపీడలు కనిపిస్తే వేపనూనె చల్లుకోవచ్చు. అలాగే బంతి ఆకులు లేదా పూలు, వెల్లుల్లి, పొగాకు కాడలు, వేపాకు, సీతాఫలం ఆకుల చిగుళ్లు.. రసం తీసి 4 రోజులు నిల్వ ఉంచి మొక్కలకు అప్పుడప్పుడూ చల్లుకోవచ్చు. దీని వల్ల చీడను నివారించి ఇంటి అవసరాలకు సరిపోయే మంచి నాణ్యమైన కూరగాయలు పండించుకోవచ్చు. దానివల్ల ఏడాది పొడువునా కూరగాయలు అందుబాటులో ఉండేలా చేసుకోవచ్చు. దాంతో మేడపై పచ్చదనం పరచుకోవడంతో ఇంట్లో కూడా చల్లని వాతావరణం నెలకొంటుంది. ఇంటిపైనే పండించుకున్న కూరగాయలు తింటూ ఆరోగ్యంగా గడపొచ్చు.

Story first published: Monday, December 26, 2011, 14:52 [IST]
Desktop Bottom Promotion