Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
వామ్మో.. వింత వ్యాధితో చనిపోతున్న ప్రజలు.. అది కూడా మన దేశంలోనే!
నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసానికి ప్రపంచం అంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ మహమ్మారి బారి నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఇది ఇలా ఉండగానే కొన్ని వింత, గుర్తు తెలియని వైరస్లు ప్రపంచం మీదకు దాడి చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన డింగా డింగా వైరస్ కూడా ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్లో గుర్తు తెలియని వ్యాధి కారణంగా పలువురు మృతి చెందడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఎంతమంది చనిపోయారంటే?
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో గల బాధల్ గ్రామంలో ఈ వ్యాధి కలకలం రేపుతోంది. అంతు చిక్కని ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఏ విధంగా ఇది సోకుతుందో తెలియక రాజౌరి జిల్లా అధికారులతో పాటు ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా మదనపడుతున్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడం పైగా రెండు కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రజలంతా కంగారు పడుతున్నారు.

దీంతో విషయం తెలుసుకున్న రాజౌరి జిల్లా అధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించబడంతో కేంద్రం బయోసేఫ్టీ లెవల్ 3 (BSL-3) మొబైల్ లాబొరేటరీని రాజౌరికి పంపించింది. ఆ వ్యాధి ఏంటి? ఎందుకు అక్కడి ప్రజలు చనిపోతున్నారు అనేది పరీక్షిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి? అనేది పరిశోధిస్తున్నారు.
మరో కరోనా అవుతుందా?
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వైరస్ ప్రమాదాన్ని తెలిసి ఎక్కడ మరోసారి ప్రపంచాన్ని విధ్వంసానికి గురి చేస్తుందో అని కంగారు పడుతున్నారు. ఈ వ్యాధి ఎలా సోకుతుందో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తమకు ఎక్కడ సోకుతుందో అని కంగారు పట్టుకుంటున్నారు. మరో కరోనా వైరస్ అవుతుందా అని భయపడుతన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకె విధానం తెలియక అయోమయంలో ఉన్నారు. మరి ఈ వ్యాధి దేనికి దారి తీస్తుందోనని కంగారు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications











