Latest Updates
-
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
వామ్మో.. వింత వ్యాధితో చనిపోతున్న ప్రజలు.. అది కూడా మన దేశంలోనే!
నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసానికి ప్రపంచం అంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ మహమ్మారి బారి నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఇది ఇలా ఉండగానే కొన్ని వింత, గుర్తు తెలియని వైరస్లు ప్రపంచం మీదకు దాడి చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన డింగా డింగా వైరస్ కూడా ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్లో గుర్తు తెలియని వ్యాధి కారణంగా పలువురు మృతి చెందడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఎంతమంది చనిపోయారంటే?
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో గల బాధల్ గ్రామంలో ఈ వ్యాధి కలకలం రేపుతోంది. అంతు చిక్కని ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఏ విధంగా ఇది సోకుతుందో తెలియక రాజౌరి జిల్లా అధికారులతో పాటు ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా మదనపడుతున్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడం పైగా రెండు కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రజలంతా కంగారు పడుతున్నారు.

దీంతో విషయం తెలుసుకున్న రాజౌరి జిల్లా అధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించబడంతో కేంద్రం బయోసేఫ్టీ లెవల్ 3 (BSL-3) మొబైల్ లాబొరేటరీని రాజౌరికి పంపించింది. ఆ వ్యాధి ఏంటి? ఎందుకు అక్కడి ప్రజలు చనిపోతున్నారు అనేది పరీక్షిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి? అనేది పరిశోధిస్తున్నారు.
మరో కరోనా అవుతుందా?
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వైరస్ ప్రమాదాన్ని తెలిసి ఎక్కడ మరోసారి ప్రపంచాన్ని విధ్వంసానికి గురి చేస్తుందో అని కంగారు పడుతున్నారు. ఈ వ్యాధి ఎలా సోకుతుందో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తమకు ఎక్కడ సోకుతుందో అని కంగారు పట్టుకుంటున్నారు. మరో కరోనా వైరస్ అవుతుందా అని భయపడుతన్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకె విధానం తెలియక అయోమయంలో ఉన్నారు. మరి ఈ వ్యాధి దేనికి దారి తీస్తుందోనని కంగారు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications