Latest Updates
-
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.!
లోకల్ ట్రైన్లో శునకం.. ఈ రెగ్యులర్ ప్యాసెంజర్ రూటే సెపరేటు
ముంబయిలో ట్రైన్ జర్నీ అంటే చుక్కలు కనిపిస్తాయి. రోజూ లక్షలాది మంది ఈ లోకల్ ట్రైన్ సేవలు వినియోగించుకుంటారు. ఉదయం పనులకు వెళ్లే సమయంలో, సాయంత్రం ఇంటికి వచ్చే వేళ లోకల్ ట్రైన్స్, ప్రభుత్వ బస్సులు జనాలతో కిక్కిరిసిపోతుంటాయి. అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ముంబయి స్టేషన్లు ముందు వరుసలో ఉంటాయి.
దేశంలోని అత్యంత రద్దీ నగరాల్లో ముంబయి ఒకటి. ఈ మాయానగరిలో నివసించే మెజారిటీ జనం లోకల్ ట్రైన్లను బాగా ఉపయోగిస్తారు. రద్దీ ఎక్కువైనప్పటికీ ప్రయాణ ఖర్చు చాలా తక్కువ కావడంతో లోకల్ ట్రైన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి.

ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేని ముంబయి నగరాన్ని ఊహించుకోవడం దాదాపు అసాధ్యం. లెక్కలేనన్ని మంది తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోవడానికి ఈ రైళ్లపై ఆధారపడతారు. ముంబయిలో ఫైమస్ అయిన డబ్బావాలాలు కూడా లోకల్ ట్రైన్స్ ను ఎక్కువగా వాడుతుంటారు.
అయితే ఓ శునకం కూడా మనుషుల్లాగే ముంబయి లోకల్ ట్రైన్ సేవలను ఫుల్లుగా వాడేసుకుంటోంది. రోజూ ఈ డాగ్ లోకల్ రైళ్లలో ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
'ఇండియా కల్చరల్ హబ్' అనే ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ ఈ శునకం ట్రైన్ జర్నీ వీడియోను పోస్టు చేసింది. 'మీట్ ది లోకల్ ట్రైన్స్ రెగ్యులర్ ట్రావెలర్ ఇన్ ముంబయి' అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేసింది. బోరివాలి నుండి అంధేరీ వరకు ఈ శునకం రోజూ రైలులో ప్రయాణిస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పారు. బోరివాలికి లోకల్ ట్రైన్ రాగానే ఎక్కేస్తుంది. తనకు ఇష్టమున్న చోట కూర్చుంటుంది. అప్పుడప్పుడు పడుకునిి జర్నీ చేస్తుంది. తన స్టాప్ రాగానే దిగేసి వెళ్లిపోతుంది.
ట్రైన్ లోకి ఎక్కే ఇతర ప్రయాణికులను ఈ శునకం ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. పక్కనే కూర్చుని తన గమ్యస్థానం కోసం వెయిట్ చేస్తుంది. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనుషులు పడుకున్నట్లుగానే.. ఈ స్లమ్ డాగ్ కూడా కునికిపాట్లు వేస్తుంది. మనుషుల్లాగే జర్నీ చేసేటప్పుడు ఒకరకమైన నిర్లిప్తతో ఉన్నట్లుగానే చూపు ఒకవైపు ఆలోచన ఇంకోవైపు ఉంచుతుంది.



Click it and Unblock the Notifications