Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
లోకల్ ట్రైన్లో శునకం.. ఈ రెగ్యులర్ ప్యాసెంజర్ రూటే సెపరేటు
ముంబయిలో ట్రైన్ జర్నీ అంటే చుక్కలు కనిపిస్తాయి. రోజూ లక్షలాది మంది ఈ లోకల్ ట్రైన్ సేవలు వినియోగించుకుంటారు. ఉదయం పనులకు వెళ్లే సమయంలో, సాయంత్రం ఇంటికి వచ్చే వేళ లోకల్ ట్రైన్స్, ప్రభుత్వ బస్సులు జనాలతో కిక్కిరిసిపోతుంటాయి. అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ముంబయి స్టేషన్లు ముందు వరుసలో ఉంటాయి.
దేశంలోని అత్యంత రద్దీ నగరాల్లో ముంబయి ఒకటి. ఈ మాయానగరిలో నివసించే మెజారిటీ జనం లోకల్ ట్రైన్లను బాగా ఉపయోగిస్తారు. రద్దీ ఎక్కువైనప్పటికీ ప్రయాణ ఖర్చు చాలా తక్కువ కావడంతో లోకల్ ట్రైన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి.

ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేని ముంబయి నగరాన్ని ఊహించుకోవడం దాదాపు అసాధ్యం. లెక్కలేనన్ని మంది తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోవడానికి ఈ రైళ్లపై ఆధారపడతారు. ముంబయిలో ఫైమస్ అయిన డబ్బావాలాలు కూడా లోకల్ ట్రైన్స్ ను ఎక్కువగా వాడుతుంటారు.
అయితే ఓ శునకం కూడా మనుషుల్లాగే ముంబయి లోకల్ ట్రైన్ సేవలను ఫుల్లుగా వాడేసుకుంటోంది. రోజూ ఈ డాగ్ లోకల్ రైళ్లలో ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
'ఇండియా కల్చరల్ హబ్' అనే ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ ఈ శునకం ట్రైన్ జర్నీ వీడియోను పోస్టు చేసింది. 'మీట్ ది లోకల్ ట్రైన్స్ రెగ్యులర్ ట్రావెలర్ ఇన్ ముంబయి' అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేసింది. బోరివాలి నుండి అంధేరీ వరకు ఈ శునకం రోజూ రైలులో ప్రయాణిస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పారు. బోరివాలికి లోకల్ ట్రైన్ రాగానే ఎక్కేస్తుంది. తనకు ఇష్టమున్న చోట కూర్చుంటుంది. అప్పుడప్పుడు పడుకునిి జర్నీ చేస్తుంది. తన స్టాప్ రాగానే దిగేసి వెళ్లిపోతుంది.
ట్రైన్ లోకి ఎక్కే ఇతర ప్రయాణికులను ఈ శునకం ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. పక్కనే కూర్చుని తన గమ్యస్థానం కోసం వెయిట్ చేస్తుంది. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనుషులు పడుకున్నట్లుగానే.. ఈ స్లమ్ డాగ్ కూడా కునికిపాట్లు వేస్తుంది. మనుషుల్లాగే జర్నీ చేసేటప్పుడు ఒకరకమైన నిర్లిప్తతో ఉన్నట్లుగానే చూపు ఒకవైపు ఆలోచన ఇంకోవైపు ఉంచుతుంది.



Click it and Unblock the Notifications