Latest Updates
-
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా..
Union Budget 2025: నేడే బడ్జెట్.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభుత్వం? ఎలా ఉంటుందంటే?
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. గతేడాది ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్తో పాటు పూర్తి స్థాయి బడ్జెట్ను ఈరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు ఎలా ఉండబుతుంది? ఏ విధమైన బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సామాన్యులకు ఊరట ఉంటుందా?
నేడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో అందరికీ మధ్యతరగతి ప్రజల అంచనాలు, డిమాండ్లు నెరవేరుతాయా లేదా అనే ఉత్సుకత నెలకొంది. అందులో భాగంగానే ఇప్పుడు అందరి దృష్టి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపైనే ఉంది. చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరించనున్నాయి. అయితే బడ్జెట్ కూడా అదే రోజు కావడంతో ఈసారి ఎల్పీజీ ధర తగ్గుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

2025 బడ్జెట్ నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు
గత సంవత్సరం ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల తరువాత ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో LPG ధరలను పెంచారు. ఆ తరువాత మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. సబ్సిడీని 8% పెంచితే ఎల్పీజీ ధర తగ్గుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
ఉద్యోగులకు ఉపశమనం ఉంటుందా?
ఈసారి బడ్జెట్లో జీతాలు పొందేవారికి పన్ను మినహాయింపు ఉంటుందని భావిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.7 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్న ఉద్యోగులపై ఎలాంటి పన్ను విధించలేదు. ఈలోగా కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా విమర్శలు గుప్పిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది.
హైదరాబాద్ వాసులు ఏం కోరుకుంటున్నారు?
తెలంగాణ, హైదరాబాద్ వాసులకు గత బడ్జెట్లో ఆశించినంత కొత్తదనం రాలేదు. కానీ ఈ బడ్జెట్లో కొంత మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలన్నారు. మెట్రో రైలు లైన్లు, మెల్సేటువే, పలు భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.



Click it and Unblock the Notifications