Kerala Alumni Love Marriage: కాలేజీ యూత్ ఫెస్ట్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న పూర్వ విద్యార్థులు

నదీమ్ - కృపా పెళ్లి బంధంతో ఒక్కటైన సందర్భానికి వేలాది మంది విద్యార్థులు సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుతం నదీమ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, కృపా న్యాయశాస్త్రం చదువుతోంది.

ఆ ఇద్దరు విద్యార్థులు కేరళలోని ఎర్నాకులం మహారాజా కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. చూపులు కలిశాయి, తర్వాత మాట కూడా కలిపారు. చూసుకున్నప్పుడు నవ్వుకోవడాలు, తరచూ మాట్లాడుకోవడాలు కామన్ అయ్యాయి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతలోనే డిగ్రీ అయిపోయింది.

Alumni get married at Maharajas college youth fest in Kerala in Telugu

చదువు పూర్తయినా సీఆర్.కృపా - కెకె.నదీమ్ ప్రేమకు మాత్రం బ్రేక్ పడలేదు. మరింత గాఢంగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు. పెళ్లి ద్వారా ఒక్కటవ్వాలని ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. నదీమ్ ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పారు. కానీ మతాంతర వివాహానికి కృపా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.

రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలని కృపా-నదీమ్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలన్నది వారి ప్లాన్. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి అయ్యాక స్నేహితులు అంతా కలిసి కాలేజీలో మీట్ అవ్వాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే అదే రోజు కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరుగుతుండటం వారికి కలిసొచ్చింది.

నదీమ్ - కృపా పెళ్లి బంధంతో ఒక్కటైన సందర్భానికి వేలాది మంది విద్యార్థులు సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుతం నదీమ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, కృపా న్యాయశాస్త్రం చదువుతోంది.

Story first published: Friday, February 10, 2023, 9:34 [IST]
Desktop Bottom Promotion